సరిలేరు నీకెవ్వరు సినిమా తో మహేష్ బాబు కు మంచి క్రేజ్ వచ్చింది. ఈ సినిమా తర్వాత ప్రస్తుతం మహేష్ బాబు సర్కారీ వారి పాట మూవీ తీస్తున్నాడు. ఇక రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ పూర్తయిన వెంటనే మహేష్ బాబు తో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు. ఆఫ్రికా అడవులు నేపథ్యంలో సాగే యాక్షన్ అడ్వెంచర్ మూవీ ఇదని తెలుస్తోంది. రాజమౌళి తండ్రి విజయభాస్కర్ ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు. అయితే ఈ చిత్రం మొదలయ్యే లకు సాధ్యమైనంత సినిమాలు చేయాలని మహేష్ చూస్తున్నాడు.
ఎందుకంటే రాజమౌళితో సినిమా అంటే కచ్చితంగా రెండు మూడు సంవత్సరాల టైం కేటాయించాల్సి ఉంది. అందుకే మహేష్ తన అభిమానులను నిరాశ పరచకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం పరశురాం బుజ్జి డైరెక్షన్లో సర్కారు వారి పాత చిత్రం చేస్తున్న మహేష్ ఆ తర్వాత ఏ దర్శకుడితో సినిమా చేసేది ఇంకా ఫిక్స్ అవ్వలేదు. రాజమౌళి తన సినిమాకి స్క్రిప్ట్ తయారు చేసుకోవడానికి ఏడాదికిపైగా టైం తీసుకుంటాడు. ఆర్.ఆర్.ఆర్ ఒసేయ్ మూడు నెలల పాటు ఫ్యామిలీతో కలిసి విదేశాలకు తీసుకువెళ్లాలని భావిస్తున్నాడట. సో 2022 నుండి రాజమౌళి మహేష్ కోసం స్క్రిప్ట్ పనులు మొదలు పెడతాడు.
అప్పటినుండి 2023 వరకు టైం తీసుకుంటాడు. మహేష్ 2021 అక్టోబర్ కి సర్కార్ వారి పాట సినిమా షూటింగ్ పూర్తి చేస్తాడు. కాబట్టి తర్వాత సినిమాను త్రివిక్రమ్ డైరెక్షన్లో చేయాలని భావిస్తున్నారు. అనిల్ రావిపూడి వెంకీ కుడుముల స్క్రిప్ట్ లకు కూడా ఒకే చెప్పినట్టు తెలుస్తుంది. అయితే తాజాగా కొరటాల శివ కూడా మహేష్ బాబుని కలిసి కథ వినిపించాడట. అది కూడా మహేష్ బాబుకు నచ్చిందట. ఇప్పటివరకు త్రివిక్రమ్ తో మాత్రమే సినిమా చేయాలని ఫిక్స్ అయిన మహేష్ కు కొత్త కన్ఫ్యూజన్ ఏర్పడింది. కొరటాల అంటే మహేష్ కు చాలా ఇష్టం. సర్కారు వారి పాట విషయంలో కూడా కొరటాల ను ఇన్వాల్ చేసాడట మహేష్.