అర్జున్ రెడ్డి అనే ఒక్క సినిమాతోనే స్టార్ డైరక్టర్ రేంజ్ అందుకున్నాడు సందీప్ వంగ. ఇక్కడే కాదు ఆ సినిమాను బాలీవుడ్ లో కూడా రీమేక్ చేసి సూపర్ హిట్ కొట్టాడు. ప్రస్తుతం రణ్ బీర్ కపూర్ తో యానిమల్ సినిమా చేస్తున్నాడు సందీప్ వంగ. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత బాలీవుడ్ లో కబీర్ సింగ్ చేసిన సందీప్ ఆ తర్వాత తెలుగులో మరో సినిమా చేస్తాడని అనుకున్నారు కాని మళ్లీ హిందీ సినిమానే చేస్తున్నాడు.

ఇక ఈ సినిమా తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో సందీప్ వంగ సినిమా ఉంటుందని తెలుస్తుంది. అర్జున్ రెడ్డి డైరక్టర్ తో ప్రభాస్ అనగానే ఆ సినిమాపై ఎక్కడ లేని అంచనాలు ఏర్పడ్డాయి. ఇంతకీ సందీప్ రెడ్డి ప్రభాస్ తో సినిమా ఎలాంటి కథతో వస్తుంది అన్నది సస్పెన్స్ గా ఉంది. ప్రభాస్ రాధే శ్యాం ఈ ఇయర్ రిలీజ్ ఫిక్స్ చేశారు. జూలై 30న సినిమా వస్తుంది.

కె.జి.ఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సలార్ నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ 14న రిలీజ్ ఫిక్స్ చేశారు. ఆదిపురుష్ వచ్చే ఏడాది చివర్లో వచ్చేలా ఉంది. సో ప్రభాస్ ప్రస్తుతం కమిటైన ఈ సినిమాలు షూటింగ్ చివరి దశకు వచ్చాక సందీప్ వంగ సినిమా ఉంటుందని తెలుస్తుంది. తప్పకుండా ఈ కాంబో ప్రేక్షకులకు ఓ అదిరిపోయే సినిమా వస్తుందని చెప్పొచు. సందీప్ వంగ మార్క్ మూవీలో ప్రభాస్ చేస్తే ఆ సినిమా బాక్సాఫీస్ పై రికార్డులను క్రియేట్ చేస్తుందని చెప్పొచ్చు.                                                        

మరింత సమాచారం తెలుసుకోండి: