ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమయ్యే షోలకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ టీవీ లో ఎన్నో రకాల షోలు టాప్ రేటింగ్  సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నాయి. అయితే ఈ టీవీ లో ప్రస్తుతం టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటున్న షో లలో సుమా  వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న క్యాష్ షో కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. క్యాష్ దొరికినంత దోచుకో అనే షో బుల్లితెర ప్రేక్షకులందరికీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందిస్తూ ఉంటుంది అనే విషయం తెలిసిందే. సాధారణంగా సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించి  అంటే చాలు ఇక షో ఎంత హడావిడిగా సాగిపోతూ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.



 ఇక క్యాష్ షో కూడా ప్రతి వారం బుల్లితెర ప్రేక్షకులందరికీ ఎంతగానో ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది. అయితే ప్రతివారం క్యాష్ షో లో భాగంగా నలుగురు కొత్త గెస్ట్ లు  ఎంట్రీ ఇస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి వచ్చిన గెస్ట్ లతో  వివిధ రకాల టాస్కులు చేయిస్తూ సుమ ఎంటర్ టైన్మెంట్ పంచుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే అయితే ఈ సారి వెరైటీగా నలుగురు కాదు ఏకంగా ఎనిమిది మంది గెస్ట్ లను  క్యాష్ ప్రోగ్రాం కి ఆహ్వానించారు.  ప్రస్తుతం బుల్లితెరపై సీరియల్స్లో నటిస్తూ ఎంతోమంది బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నటీమణులను గెస్ట్లుగా ఆహ్వానించారు.



 ఈ క్రమంలోనే అంకిత, తేజస్వి, ఆశు రెడ్డి, మహతి, హరిత, వందన, భావన గెస్ట్ లుగా ఎంట్రీ ఇచ్చారు.  ఇక సుమ ఎప్పటిలాగానే తనదైన వాక్చాతుర్యంతో ఇక అందరిని ఆటపట్టిస్తూ ఎంటర్టైన్మెంట్ పంచింది  అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సాధారణంగా సుమ వివిధ రకాల టాస్క్ లు  ఆడిస్తూ ఉంటుంది అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల క్యాష్ ప్రోమో  లో భాగంగా ఒక టాస్క్  జరుగుతున్న సమయంలో.. ఒక నటీమణీ చెప్పిన సమాధానానికి సుమ సైతం షాక్ అయింది. మీరు కాఫీ తీసుకుంటారా అంటూ స్కిట్ లో భాగంగా సుమ అడగగానే నాకు ఒక పెగ్గు కావాలి అంటూ సమాధానం చెబుతుంది నటి. దీంతో సుమ సైతం ఒక్కసారిగా షాక్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: