బాలీవుడ్ టాలీవుడ్ ప్రేమ జంటలు ఎన్నో ఉన్నాయి. వాటిలో బాలీవుడ్ లోని ప్రేమ జంటల్లో హృతిక్ రోషన్, కంగానా రానౌత్ ఒకరు. వీరిద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైంది. ట్విట్టర్ వేదికగా వారిద్దరూ పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో తన మాజీ ప్రియుడు అయిన హృతిక్ రోషన్ పై  కంగనారనౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రపంచం చాలా మారిపోయింది. కానీ తన మాజీ లవర్ మాత్రమే ఇంకా అలానే ఉన్నారని వ్యాఖ్యానించింది.


 ఎదిగేందుకు అవస్థలు పడుతూ ఉన్నాడని వ్యంగ్యాస్త్రాలు సంబంధించి.  వీరిద్దరి మధ్య 2016 నుంచి నకిలీ ఈ-మెయిల్స్ వ్యవహారం కొనసాగుతోంది. ఈ కేసులో ప్రతి ప్రసన్న తమ కార్యాలయానికి పిలిపించిన ముంబై క్రైమ్ ఇంటెలిజెన్స్ విభాగం శనివారం అతని వాంగ్మూలం నమోదు చేసింది. గత సంవత్సరం డిసెంబర్ లో పెండింగ్ లో ని నకిలీ ఇ-మెయిల్స్ ను దర్యాప్తు చేయాలని హృతిక్ రోషన్  తరపు  న్యాయవాది ముంబై పోలీస్ కమిషనర్ ను కలిసి విన్నవించారు. ఆపై ఈ కేసు విచారణ ను క్రైమ్ బ్రాండ్ కీ బదిలీ చేసిన సంగతి తెలిసిందే.


 హృతిక్ రోషన్, కంగానా రనౌత్ మధ్య ఐదేళ్ల క్రితం వరకు నడిచిన ప్రేమ వ్యవహారం 2016 లో కోర్టుకు ఎక్కింది. కంగానా చేసిన ఆరోపణలు అన్నింటిని గతంలోనే హృతిక్ రోషన్ తోసిపుచ్చాడు. తన పేరిట ఎవరు నకిలీ ఖాతాను సృష్టించి కంగానా కు ఈ మెయిల్ పంపాడు అన్నది అది హృతిక్ వాదన. వీరితో తనకేమీ సంబంధం లేదని హృతిక్ చెబుతుండగా, మొత్తం వాస్తవాలు విచారణలో బయటకు వస్తాయని కంగానా నమ్మకంగా అంటోంది. ఒకవైపు హృతిక్ రోషన్ తో జరుగుతున్న వివాదం కోర్టులో ఉండగా ఇప్పుడు ట్విట్టర్ ని టార్గెట్ చేస్తూ ఆమె అసలు ట్రెండ్ అవుతున్నాయి. తన  ట్వీట్ల పై ఆమె చట్టపరమైన ఇబ్బందులను కూడా ఎదుర్కొంటోంది. అయితే ఆమెను తట్టుకోలేక ట్విట్టర్ ఇండియా కంగాన ఖాతాను షాడో బ్యాన్ చేసినట్లు కూడా ఈ మధ్య వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆగ్రహానికి లోనైన కంగానా డైరెక్ట్ గా ట్విట్టర్ సీఈఓ పై ఆసక్తికర ట్వీట్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: