ఇప్పటికే ఆల్మోస్ట్ షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాని ఈ ఏడాది
అక్టోబర్ 13న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఇక దీని తరువాత
కోలీవుడ్ దర్శకుడు
శంకర్ దర్శకత్వంలో ఒక భారీ పాన్
ఇండియా మూవీ చేయనున్న చరణ్, అందులో ఒక డిఫరెంట్ పాత్ర చేస్తున్నట్లు సమాచారం.
టాలీవుడ్ ప్రముఖ
నిర్మాత దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఈ సినిమాలో చరణ్ కి జోడిగా
రష్మిక మందన్న నటించనుందని, అలానే దీనికి అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందించనున్నాడని అంటున్నారు.
అయితే ఇది మాత్రమే కాకుండా తదుపరి
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చరణ్ చేయనున్న సినిమాలో కూడా
రష్మిక నే
హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నారని, మంచి యాక్షన్ తో కూడిన ఎమోషనల్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ సినిమాని
కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై చరణ్ నిర్మించనున్నట్లు చెప్తున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ కథనాల్లో ఎంతవరకు నిజం ఉందొ తెలియదు గాని, ఒకవేళ ఇదే కనుక నిజం అయితే మొత్తంగా రెండు సినిమాల్లో చరణ్ ప్రక్కన నటించే ఛాన్స్ ని
రష్మిక పట్టేసినట్లే.....!!