ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ఆర్ఆర్ఆర్. తన స్నేహితుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి చరణ్ చేస్తున్న ఈ సినిమాకి దర్శకదిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తుండగా డివివి దానయ్య దీనిని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ కొమరం భీం పాత్ర చేస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో పలువురు టాలీవుడ్ తో పాటు బాలీవుడ్, హాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన నటులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. కీరవాణి సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకి సాయిమాధవ్ బుర్రా మాటలు అందిస్తుండగా  కేకే సెంథిల్ కుమార్ ఫోటోగ్రఫి అందిస్తున్నారు.
ఇప్పటికే ఆల్మోస్ట్ షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాని ఈ ఏడాది అక్టోబర్ 13న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఇక దీని తరువాత కోలీవుడ్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఒక భారీ పాన్ ఇండియా మూవీ చేయనున్న చరణ్, అందులో ఒక డిఫరెంట్ పాత్ర చేస్తున్నట్లు సమాచారం. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఈ సినిమాలో చరణ్ కి జోడిగా రష్మిక మందన్న నటించనుందని, అలానే దీనికి అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందించనున్నాడని అంటున్నారు. 

అయితే ఇది మాత్రమే కాకుండా తదుపరి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చరణ్ చేయనున్న సినిమాలో కూడా రష్మిక నే హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నారని, మంచి యాక్షన్ తో కూడిన ఎమోషనల్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై చరణ్ నిర్మించనున్నట్లు చెప్తున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ కథనాల్లో ఎంతవరకు నిజం ఉందొ తెలియదు గాని, ఒకవేళ ఇదే కనుక నిజం అయితే మొత్తంగా రెండు సినిమాల్లో చరణ్ ప్రక్కన నటించే ఛాన్స్ ని రష్మిక పట్టేసినట్లే.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: