టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఒక్కో సినిమాతో నటుడిగా మరింత ఉన్నత శిఖరాలు అందుకుంటూ వేగంగా దూసుకెళ్తున్నారు. ఇటీవల సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన సాహో మూవీ ద్వారా ప్రేక్షకులు ముందుకు వచ్చిన ప్రభాస్, ప్రస్తుతం మొత్తంగా మూడు సినిమాల్లో నటిస్తున్నారు. వాటిలో ముందుగా రాధాకృష్ణ దర్శకత్వంలో నటిస్తున్న రాధేశ్యామ్ మూవీ ఆల్మోస్ట్ పూర్తి కావచ్చింది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ, కృష్ణంరాజు, ప్రియదర్శి, జయరాం తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ యొక్క ఫస్ట్ లుక్ టీజర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ మూవీ జులై 30న రిలీజ్ కానుంది.

దీనితో పాటు బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ తో పాటు కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమాలు కూడా చేస్తున్నారు ప్రభాస్. సలార్ మూవీ యొక్క ఫస్ట్ షెడ్యూల్ ఇటీవల గోదావరి ఖనిలో జరిగింది, దీని తదుపరి షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగనున్నట్లు టాక్. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ని హోంబలె ఫిలిమ్స్ వారు ఎంతో భారీ ఖర్చుతో నిర్మిస్తున్నారు. వాస్తవానికి ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ చేస్తారని అందరూ భావించారు. అయితే ఇప్పటికే మహేష్ నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా ఆ సమయానికి రిలీజ్ అవుతుంది అని మేకర్స్ అనౌన్స్ చేయడం, అలానే నేడు ఉదయం పవన్ కళ్యాణ్, క్రిష్ ల కాంబోలో తెరకెక్కుతున్న పీరియాడికల్ మూవీ కూడా అదే సమయంలో విడుదల కానుంది అంటూ ప్రకటన రావడంతో కొంత ఆలోచన చేసిన అనంతరం సలార్ ని వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఏప్రిల్ 14 న రిలీజ్ చేస్తున్నట్లు ఆ మూవీ దర్శక నిర్మాతలు ప్రకటన రిలీజ్ చేశారు. 

అయితే దీని వెనుక కొంత కథ ఉందని, నిజానికి తాము కూడా సంక్రాంతి రావాలని భావించినప్పటికీ అప్పటికే మహేష్, పవన్ ల సినిమాలు బరిలో ఉండడంతో మొత్తం ముగ్గురు కూడా అదే సమయంలో రిలీజ్ లు ప్లాన్ చేస్తే బాక్సాఫీస్ పరంగా ఇబ్బదులు వచ్చి బయ్యర్లు నష్టపోతారు అనే ఆలోచనతో హీరో ప్రభాస్ సహా, మిగతా యూనిట్ మొత్తం కూడా సినిమాని మెల్లగా పూర్తి చేసి సమ్మర్ లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేసారని అంటున్నారు. ఒకరకంగా సలార్ యూనిట్ చేసిన ఈ ఆలోచన మంచిదని, తప్పకుండా ఆ మూవీ సమ్మర్ లో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయం అని పలువురు విశ్లేషకులు అభిప్రాయపధాతున్నారు......!!







మరింత సమాచారం తెలుసుకోండి: