అలా చూసుకున్న అందుకుగాను వచ్చే లాభాలలో వాటా ఇస్తామని సుకుమార్ కు ఆఫర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో దానికి ఒప్పుకున్న సుకుమార్ తన శిష్యుడిని గ్రాండ్ గా లాంఛ్ చేశారు. అలా మొత్తం మీద ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో మైత్రీ వాళ్లకు 50 కోట్ల మేర లాభం వచ్చింది. దీంతో అందులో సగం అంటే దాదాపు పాతిక కోట్ల రూపాయల మేర సుకుమార్ సొంతమైనట్టు చెబుతున్నారు. అయితే ఈ మొత్తాన్ని ఇప్పుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కనున్న సినిమా కోసం సుకుమార్ ఖర్చు పెట్టేందుకు సిద్ధం అయినట్లు చెబుతున్నారు.
సాయి ధరమ్ తేజ్ హీరోగా కుర్ర దర్శకుడు కార్తీక్ ను పరిచయం చేస్తూ సుకుమార్ ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మీద ఇప్పుడు ఉప్పెన మీద వచ్చిన ప్రాఫిట్ పెడుతున్నారు అని అంటున్నారు. ఏ మాత్రం బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా సినిమా నిర్మించాలని సుకుమార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం కావాల్సి ఉంది. అలానే హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలు కూడా తెలియాల్సి ఉంది.