రాక్షసుడు సినిమాతో హిట్ కొట్టిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఆ తర్వాత అల్లుడు అదుర్స్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా దారుణమైన రిజల్ట్ అందుకుంది. సంక్రాంతి కానుకగా విడుదల అయిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఈ సినిమా రిలీజ్ కాక మునుపే ఈయన బాలీవుడ్ లో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు. అందుకే మన దగ్గర పదిహేనేళ్ల క్రితం రిలీజ్ అయి సూపర్ హిట్ గా నిలిచిన ఛత్రపతి సినిమాని అక్కడ రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా సూపర్ హిట్ సినిమాల దర్శకుడు వి.వి.వినాయక్ తెరకెక్కిస్తున్నారు. 


సినిమా గురించి ముందు నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ వస్తోంది. అయితే ఎంత ప్రచారం జరిగినా సరే ఈ సినిమాకు హీరోయిన్ దొరకడం కష్టంగా మారింది. ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఒక హీరోయిన్ ను నటింపజేయాలని మేకర్స్ భావిస్తున్నారు. అయితే ఆయన సరసన నటించేందుకు సిద్ధంగా లేరు. కొద్ది రోజుల క్రితం మేకర్స్ తో లైగర్ సినిమా చేస్తున్న అనన్య పాండేను సంప్రదించారు. బెల్లం బాబు సరసన నటించడానికి ఆమె ఇంట్రెస్ట్ చూపించలేదు. 


దీంతో ఇప్పుడు నిర్మాతలు పూజ హెగ్డే ను సంప్రదించగా ఆమె కూడా తాను నటించలేనని చెప్పి షాక్ ఇచ్చినట్లు చెబుతున్నారు. నిజానికి పూజ గతంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన కథానాయికగా నటించింది. శ్రీవాస్ దర్శకత్వంలో వచ్చిన సాక్ష్యం సినిమాలో వీరిద్దరూ కలసి నటించారు. అయితే ఈ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది. అదీ కాక ఇప్పుడు పూజ అన్నీ భారీ బడ్జెట్ సినిమాలు చేస్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్ తో చేస్తే ఇబ్బంది అవుతుందని భావించి ఆమె నో చెప్పినట్లు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: