టాలీవుడ్ యాక్ట్రెస్ రిచా గంగోపాధ్యాయయ్ అనే పేరు వినపడగానే మనకు ముందుగా మిర్చి, మిరపకాయ్, సారొచ్చారు మూవీల లో నటించిన హీరోయిన్ గుర్తుకు వస్తుంది. లీడర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రిచా గంగోపాధ్యాయ్ ఈ సినిమాతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత వచ్చిన మిర్చి సినిమాలతో పాటు ఇతర భాషల్లో సినిమాల్లో కూడా నటించింది. ఆ తర్వాత సినిమాలో నుంచి కొంచెం గ్యాప్ తీసుకుని చదువు కోసం వాషింగ్టన్ వెళ్ళింది.

 రీచా గంగోపాధ్యాయ్ జాయ్ అనే అతనితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి పెళ్లి దాకా వచ్చింది. అలాగే 2019లో రీచా గంగోపాధ్యాయ్ కొంతమంది సన్నిహితుల మధ్య హిందూ మరియు క్రిస్టియన్ పద్ధతిలో  వీరి వివాహం ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలను కూడా రీఛా తన అభిమానులతో షేర్ చేసుకుంది. అయితే రీచా  గంగోపాధ్యాయ్ ఇక ఈ మధ్యనే తాజాగా ఓ శుభవార్త చెప్పారు.


 రీచా గంగోపాధ్యాయ్ తాను తల్లి కాబోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం ఉదయం ట్విట్టర్ వేదికగా బేబీ బంపు తో ఉన్న చిత్రాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఎంతో కాలం నుంచి ఓ విషయాన్ని మేము రహస్యంగా దాచి ఉంచాం.  ఈరోజు అందరికీ ఆ విషయాన్ని తెలియజేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. జూన్ నెలలో మా కుటుంబంలో కి ఓ చిన్నారి రానుంది.                                      


 మేము ప్రస్తుతం మాటల్లో చెప్పలేనంత సంతోషాన్ని ఆస్వాదిస్తునాను. మా చిన్నారి కోసం ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నాను. రీచా గంగోపాధ్యాయ్ ప్రకటించారు.  లీడర్ చిత్రంతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైన రిచా గంగోపాధ్యాయ్. నాగవల్లి మిరపకాయ్,సారొచ్చారు, వంటి చిత్రాల్లో నటించారు. మిర్చి సినిమా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. 2013లో భాయ్ సినిమా తర్వాత అని ఉన్నత విద్య కోసం వెళ్లారు.

మరింత సమాచారం తెలుసుకోండి: