కొంత మంది సెలెబ్రిటీ లు తమ భార్యపై ఉన్న ప్రేమను ప్రపంచానికి చాటి చెప్పడానికి చాలా ప్రయత్నా లు చేస్తుంటారు. కొంతమంది మాటల్లో, మరికొంతమంది చేతల్లో చూపిస్తూ వారి ప్రేమను చాటిచెప్తుంటారు. అయితే బాలీవుడ్ లో ఓ జంట మాత్రం ఒకడుగు ముందుకేసి తమ పర్సనల్ ఫోటో ను షేర్ చేస్తూ వారి మధ్య ప్రేమానురాగాన్ని చెప్పింది.. భార్య ఎదపై తలవాల్చి ఉన్న ఆ భర్త ఫోటో ని చూసి ఇప్పుడు అందరు షాక్ అవుతున్నారు..

ఇంతకీ ఎవరా జంట అనుకుంటున్నారా.. నటుడు మిలింద్‌ సోమన్‌ అయన భార్య అంకిత కొన్వార్..  మిలింద్‌ సోమన్‌ తన భార్య అంకిత కొన్వార్‌పై ప్రేమను చాలా వెరైటీ గా చాటుకున్నాడు.తమ ప్రేమ బంధానికి ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా ఇన్‌స్టాలో సతీమణి ఆలింగనంలో సేదతీరుతున్న ఫొటో షేర్‌ చేయాగా ఆ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది.. ఈ పోస్ట్ లో ‘‘ఏడేళ్ల ప్రయాణంలో ప్రపంచమంతా చుట్టివచ్చాం. సముద్ర గర్భంలోకి వెళ్లాం. శిఖరాల అంచుల వరకు వెళ్లగలిగాం. దేశ విదేశాల ను సందర్శించాం. అడవుల్లో విహరించాం. పడవల్లో తిరిగాం. ఎడారులు, అగ్నిపర్వతాలు.. ఇలా అన్నీ చూశాం కదా. మరి నాకిష్టమైన ప్రదేశం ఏమింటే.. ఇదిగో ఇక్కడే.. నీ బాహువుల్లో (చేతు ల్లో) ఇలా ప్రశాంతంగా నిద్రపోవడం అంటే ఇష్టం... ఎప్పటికీ అంతంకాని మన ప్రేమకు.. ఇలాంటి వార్షికోత్సవాలు ఎన్నెన్నో’’ అంటూ  క్యాప్షన్‌ జతచేశాడు.

ఇందుకు స్పందనగా అంకిత సైతం భర్త మిలింద్‌ రాసిన వాక్యాల్లోని ప్రదేశాలను ప్రతి బింబించేలా ఆయా చోట్ల తాము దిగిన ఫొటోలు పోస్ట్‌ చేశారు. ఏడేళ్లు ఒక్క క్షణంలా గడిచిపోయాయి. ఈ జ్ఞాపకాలు కలకాలం ఇలాగే నిలిచిపోతాయి. నా ప్రేమమూర్తిగా ఉన్నందుకు థాంక్యూ’’ అంటూ ఎమోషనల్‌ అయ్యా రు. దీంతో.. ‘‘మీ ఇద్దరి బంధం చిరకాలం ఇలాగే వర్ధిల్లాలలి’’అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: