రష్మిక మందన చలో సినిమాతో టాలీవుడ్ లోకి వచ్చిన అందాల భామ. ఈ ముద్దు గుమ్మ గీతా గోవిదం సినిమాతో తన సత్తా చాటుకుంది. ఆ మూవీ తరువాత యూత్ గుండెల్లో కొలువుండిపోయింది. ఇక రష్మిక మందన వరసపెట్టి స్టార్ హీరోల పక్కన సినిమాలు చేస్తూ టాలీవుడ్ రేసులో దూసుకుపోతోంది.

గత ఏడాది సూపర్ స్టార్ మహేష్ బాబు తో కలసి నటించిన సరిలేరు నీకెవ్వరు మూవీ సూపర్ డూపర్ హిట్. అంతే ఆ సినిమా తరువాత అల్లు అర్జున్ తో సుకుమార్ డైరెక్షన్ లో వస్తున్న పుష్ప సినిమాలో రష్మిక మెయిన్ లీడ్ ఫెమేల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్ లో తీస్తున్నారు. ఈ మూవీ తరువాత రష్మిక బాలీవుడ్ వైపు చూస్తోంది అనుకుంటే ఆమెకు తెలుగులోనే మరో సూపర్ కాంబోలో చాన్స్ వచ్చింది.

మోస్ట్ ఎవైటింగ్ మూవీగా రానున్న రామ్ చరణ్, శంకర్ కలయికలోని మూవీలో రష్మికను హీరోయిన్ గా సెలెక్ట్ చేశారని వార్తలు వస్తున్నాయి. అటు వైపు శంకర్, ఇటు వైపు చరణ్. దాంతో ఈ మూవీతో టాలీవుడ్ లో రష్మిక నంబర్ వన్ హీరోయిన్ కావడం ఖాయమని అంటున్నారు. ఇపుడున్న హీరోయిన్ల లిస్ట్ చూస్తే రష్మికను పడుతునన్ సినిమాలు, ఆమెకు దక్కుతున్న ఆఫర్లను బట్టి నంబర్ వన్ హీరోయిన్ ఆమె అని కచ్చితంగా చెప్పాల్సిందే అంటున్నారు టాలీవుడ్ సినీ ఎనలిస్టులు. ఇదే ఊపులో మరో రెండు బ్లాక్ బస్టర్ హిట్లు పడితే రష్మిక అటు బాలీవుడ్ నుంచి ఇటు టాలీవుడ్ దాకా జెండా పాతేయడం ఖాయమే అంటున్నారు. రష్మిక పూజా హెగ్డే ఇప్పటిదాకా ఒకరి మీద ఒకరు పై చేయి సాధించాలని  పోటీ పడ్డారు. ఇక బాలీవుడ్ లో పూజా హెగ్డే తన లక్ పరీక్షించుకుంటూ టాలీవుడ్ ఆఫర్లను పక్కన పెడుతూంటే రష్మిక అక్కడా ఇక్కడా కాలూ పెడుతోంది. దీంతో టాలీవుడ్ లో ఆమె నంబర్ వన్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: