డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం భారీ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఒక సినిమా సెట్ పై ఉండగానే మరోసినిమాను తెరకెక్కిస్తున్నారు ఈ ఆరడుగుల అందగాడు. భారీ చిత్రం బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ పూర్తిగా మారిపోయింది. కేవలం ఈ హీరో పాన్ ఇండియా సినిమాలనే చేస్తూ.. తన అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నారు. ప్రస్తుతం ఈ హీరో నటిస్తున్న అన్ని సినిమాలు భారీ బడ్జెట్ తో.. అంతకు మించి భారీ అంచనాలతో తెరకెక్కుతున్నాయి. ఇప్పటికే ప్రభాస్ మాంచి లవ్ స్టోరీతో వస్తున్న ‘రాధేశ్యామ్’ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకున్నారు. కాగా మరికొన్ని రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ప్రభాస్ సలార్ సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు.
ఈ సినిమాతో పాటుగా ప్రభాస్ ఇంకొన్ని సినిమాల్లో కూడా పాల్గొంటున్నారు. ఇకపోతే ఈ హీరో సినిమాలు రిలీజ్ కాక చాలా కాలమే అవుతోంది. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటుగా ఏడాదికి ఒక్క సినిమా కూడా ప్రభాస్ రిలీజ్ చెయ్యడం లేదని డార్లింగ్ ఫ్యాన్స్ తెగ ఫీల్ అయిపోతున్నారు. ఇక డార్లింగ్ తన ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషీ చెయ్యడానికి సిద్దమైపోయాడు. బాహుబలి తర్వాత వచ్చిన విరామాన్నిఅదిరిపోయే సినిమాలతో కవర్ చేశారు ప్రభాస్. మున్ముందు ఇలాంటి గ్యాప్ అస్సలుకే రావని డార్లింగ్ బాహుబలి 2 ఈవెంట్ లో ఒకసారి.. సాహో ఈవెంట్ లో మారోసారి తన ఫ్యాన్స్ కు మాటిచ్చారు. ఇలా ఇచ్చిన మాటను ప్రభాస్ నాలుగేండ్లుగా నిలబెట్టుకోలేకపోయాడు. కానీ 2022 లో ఆ మాటలను నిలబెట్టుకోబోతున్నారు.

సంవత్సరానికి ప్రభాస్ రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావాలన్న తన ఫ్యాన్స్ కలను 2022 లో తీర్చబోతున్నాడు డార్లింగ్.  భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ‘సలార్’ సినిమా అనౌన్స్ మెంట్ తో ఈ కల నిజమవుతోంది. రెబల్ స్టార్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’ సినిమాను 2022 ఆగస్టు 11 రిలీజ్ అవనుందని ఈ చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. ఇక తాజాగా ‘సలార్’ విడుదల తేదీని కూడా ఈ చిత్ర యూనిట్ ప్రకటించేసింది. ఈ మూవీని 2022 ఏప్రిల్ 14 న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నామని నిర్మాతలు ప్రకటించారు. ఈ రెండు సినిమాల విడుదలతో డార్లింగ్ తన ఫ్యాన్స్ కు దిల్ ఖుష్ చెయ్యడానికి సిద్దమైనట్టుతెలుస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: