బన్నీకి జోడీగా వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక మందన నటిస్తోంది.ఈ సినిమాను ఆగష్టు 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.ఈ సినిమా తర్వాత బన్ని కొరటాల శివతో చేయనున్నాడు. 'పుష్ప' సినిమా తర్వాత అల్లు అర్జున్, కొరటాల శివ సినిమా తెరకెక్కనుంది. కొరటాల శివ ఆచార్య తర్వాత, బన్ని పుష్ప తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. మరోవైపు ఈ సినిమాలో మరో ఇంపార్టెంట్ రోల్ ఉంది. ఈ పాత్ర కోసం వరలక్ష్మి శరత్ కుమార్ను అనుకుంటున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్.. ఫస్టాఫ్లో స్టూడెంట్ లీడర్గా..
సెకండాఫ్లో రాజకీయ నాయకుడిగా కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో బన్ని ఢీ కొట్టే పొలిటికల్ లీడర్ పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటించడం దాదాఫు ఖాయం అయిందట.ఇప్పటికే రవితేజ 'క్రాక్'లో జయమ్మగా.. అల్లరి నరేష్.. 'నాంది'లో ఆద్యగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన వరలక్ష్మి ఈ సినిమాలో కూడా పవర్ఫుల్ విలన్ పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం..మరి ప్రస్తుతం ప్రచారమవుతున్న ఈ వార్తలో వాస్తవం ఎంతుందో తెలియాలంటే.. దీనిపై ఆఫీషీయల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు ఆగాల్సిందే.ఇలాంటి మరెన్నో లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని తప్పకుండా ఫాలో అవ్వండి....!!