పరశురాం తెరకెక్కిస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమాలో మహేశ్ బాబును ‘పోకిరి’ లుక్ కు షిఫ్ట్ చేనే విధంగానే కనిపిస్తోంది. అందుకే మహేశ్ తన లుక్ ను పూర్తిగా మార్చేసినట్టు తెలుస్తోంది. మీసకట్టు తీసేసి సోడాబుడ్డి కళ్లజోడు తగిలించుకుని.. పక్కా కాలేజీ పిల్లోడిలా కనిపిస్తున్నాడు ఈ సూపర్ స్టార్. అందులోనూ ఒక సైడ్ పాపిడితో.. కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు మహేశ్. ఈ లుక్ లో మహేష్ పిక్ ను చూసిన ఫ్యాన్స్ అయితే.. మహేశ్ ఏజ్ పాతికేళ్లు తగ్గిపోయిందనట్టుందే అంటూ కామెంట్లు కూడా చేశారు. అచ్చం బడికెళ్లే కుర్రాడిలానే మహేశ్ కనిపిస్తున్నారంటూ ప్రిన్స్ ఫ్యాన్స్ తెగ సంబురపడిపోయారు.
పరశురాం డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘సర్కారు వారి పాట’ బ్యాంకింగ్ కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కుతున్నది. కాగా మహేష్ ఈ సినిమాలో వేలాది కోట్ల స్కామ్ ల మూలంగా అనేక ఇబ్బందులను ఎదర్కొనే బ్యాంక్ మేనేజర్ కొడుకుగా నటిస్తున్నారు. అయితే ఈ కుంభకోణం కోణం నుంచి తన తండ్రిని ఏ విధంగా బయటపడేసాడన్నదానిపైనే ఈ స్టోరీ సారాంశం. ఈ మూవీలో తండ్రీ కొడుకుల అనుబంధంతో పాటుగా.. మహేశ్ బాబు, కీర్తి సురేష్ మధ్యన రొమాంటిక్ లవ్ స్టోరీ కూడా రన్ అవుతుందట. ఈ మధ్యనే ఈ సర్కారు వారు దుబాయ్ లో షెడ్యూల్ ను కంప్టీట్ చేసుకుని.. హైదరాబాద్ చేరుకుంది. తదుపరి ఓ కీలక షెడ్యూల్ ను కూడా తెరకెక్కించేందుకు పరశురాం ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.