‘దొరసాని’ సినిమాతో టాలీవుడ్‏లోకి హీరోగా పరిచయమయ్యాడు విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ. ఆ సినిమా బాక్సాఫీసు వద్ద ఆశించినంతగా విజయం సాధించలేకపోయింది. ఇటీవల వచ్చిన ‘మిడిల్ క్లాస్ మెలోడిస్’ మూవీతో హిట్ కొట్టాడు ఈ యంగ్ హీరో. భావోద్వేగమైన ప్రేమ కథలతో వచ్చిన ఈ సినిమా.. డిజిటల్ ఫ్లాట్ ఫామ్ మీద సూపర్ హిట్ సాధించింది. ఈ మూవీ హిట్‏తో వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు ఆనంద్. ఆయన తర్వాతి సినిమా పుష్పక విమానం పోస్టర్ ఈరోజు విడుదలయ్యింది.ఈ సినిమా పోస్టర్ చూడటానికి కొత్తగా  ఉంది. అలాగే ఈ సినిమాలో ప్రముఖ నటుడు సునీల్ కూడా నటించడం ఇంకొక విశేషం . ఈ సినిమా పోస్టర్ ని విజయ్ దేవరకొండ ప్రత్యేకంగా తన సోషల్ మీడియా లో పోస్ట్ చేసాడు. కొత్త కొత్త టాలెంట్ ని ఇండస్ట్రీ కి పరిచయం చేస్తునందుకు తన తమ్ముడుని మెచ్చుకున్నాడు విజయ్ . ఇక ఆనంద్ దేవరకొండ కూడా హీరోగా మాస్ సినిమాలు చేయకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాలని ఎంచుకుంటు ముందుకు వెళ్తున్నాడు. ఇక ఈ పుష్పక విమానం కూడా త్వరలోనే ఎగరబోతుంది. ఈ సినిమా పోస్టర్ తోనే మంచి బజ్ పుట్టించిన మూవీ టీం ఇంక త్వరలోనే ట్రైలర్ తో ముందుకు రాబోతుంది. ఇక ఆనంద్ దేవరకొండ తర్వాత చిత్రంనికి అవినాష్ కోకాటి అనే కొత్త దర్శకుడు చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అంతేకాకుండా.. కాన్సెప్ట్ బేస్డ్ కథ కావడంతో ఈ మూవీ గురించి ఆనంద్ చాలా ఆసక్తిగా ఉన్నట్లుగా టాక్. ఈ సినిమా మార్చి నుంచి రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీతో విభిన్న కథాంశాలకు ఆనంద్ ఓకే చెప్తున్నాడు.కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చే దర్శకులకి ఇది ఒక మంచి అవకాశం. అయితే ఈ సినిమాలు థియేటర్స్ లో ఏ రేంజ్ లో అడుతాయో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: