ఈ మధ్య కొందరు హీరోయిన్స్  తండ్రుల పేర్లు నిలబెడుతూ దూసుకుపోతున్నారు. అందులో శృతి హాసన్ ఈ తరంలో అందరికంటే ముందుంది. కమల్ నట వారసురాలిగా వచ్చి స్టార్ హీరోయిన్ అయిపోయింది శృతి. ఆమెతో పాటు వరలక్ష్మి కూడా సత్తా చూపిస్తుంది. శరత్ కుమార్ కూతురుగా ఇండస్ట్రీకి వచ్చిన ఈమె.. ఇప్పుడు వరస అవకాశాలతో దూసుకుపోతుంది. కేవలం హీరోయిన్ గానే నటిస్తానని కూర్చోకుండా కారెక్టర్ ఆర్టిస్టు అయిపోయింది వరలక్ష్మి. మొదట్లో కొన్ని సినిమాలు మాత్రమే హీరోయిన్ గా నటించినా కూడా ఆ తర్వాత తన ఇమేజ్ కు తగ్గట్లు విలన్ గా సెటిల్ అయిపోయింది.ఇప్పటికే సర్కార్, పందెంకోడి 2 సహా చాలా సినిమాల్లో విలన్ గా రప్ఫాడించింది. మొన్నటికి మొన్న తెలుగులో క్రాక్ సినిమాలో జయమ్మగా అదిరిపోయే పర్ఫార్మెన్స్ చేసింది వరలక్ష్మి. ఆ దెబ్బతో తెలుగులోనూ బిజీ ఆర్టిస్ట్ అయిపోయింది ఈమె. తాజాగా విడుదలైన నాంది సినిమాలో కూడా ఓ అద్భుతమైన పాత్రలో నటించింది వరలక్ష్మి. ఇందులో లాయర్ పాత్రలో మెరిసింది వరలక్ష్మి. ఆమె వచ్చిన తర్వాత సినిమా రేంజ్ మరింత పెరిగిపోయింది. కొత్త దర్శకుడు విజయ్ కనకమేడల తెరకెక్కించిన ఈ సినిమాలో ఇండియన్ పీనల్ కోడ్ గురించి చర్చించారు. ఇంటర్వెల్ ముందు వచ్చే ఈ పాత్ర సినిమా స్థాయిని పెంచేసిందంటే సూపర్ హిట్ గా చేసింది. ఈ సినిమా తర్వాత వరలక్ష్మి మరింత పెరిగింది.ఇక ఇప్పుడు ఆమె అల్లు అర్జున్ సినిమాలో ఒక ప్రత్యేక పాత్ర పోషించబోతుంది. అల్లు అర్జున్ - కొరటాల శివ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మి రాజకీయనాయకురాలు గా కనిపించబోతుంది. ఇక ఈమె స్పీడ్ చూస్తుంటే కచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుగులో టాప్ కారెక్టర్ ఆర్టిస్టుగా వరలక్ష్మి శరత్ కుమార్ సత్తా చూపించడం ఖాయం అయిపోయింది. ఈ సినిమాకు పారితోషికం కూడా బాగానే తీసుకుంటుంది వరలక్ష్మి.

మరింత సమాచారం తెలుసుకోండి: