ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన మొదటి చిత్రం ‘ఉప్పెన’. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ టాక్ తో మంచి వసూళ్ళని రాబట్టి దూసుకుపోతుంది.. ఇప్పటికి విడుదలయ్యి 17 రోజులు కావస్తున్నా కలెక్షన్ల జోరు ఏమాత్రం తగ్గడం లేదనే చెప్పాలి. కొత్త కొత్త సినిమాలు విడుదలవుతున్నా.. ఇంకా ఈ చిత్రం స్ట్రాంగ్ రన్ ను కొనసాగిస్తూనే ఉంది. ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ హీరోయిన్ కృతి శెట్టి అనే చెప్పాలి.కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేశాడు. ‘మైత్రి మూవీ మేకర్స్’ మరియు ‘సుకుమార్ రైటింగ్స్’ బ్యానర్ల పై నవీన్ యర్నేని, వై.రవి శంకర్, సుకుమార్ లు కలిసి నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 12న విడుదలయ్యింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతంలో రూపొందిన పాటలు, హీరోయిన్ కృతి శెట్టి లుక్స్ వంటివి మొదటి నుండీ ఈ చిత్రం పై భారీ అంచనాలు పెరిగేలా చేసాయి.


ఇక ఉప్పెన సినిమా వసూళ్ల విషయానికి వస్తే ఈ సినిమా మొదటి మూడు రోజుల్లోనే పెట్టిన పెట్టుబడి రాబట్టి బ్రేక్ ఈవెన్ అయ్యింది.‘ఉప్పెన’ చిత్రానికి 20.5 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కు 21కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉండగా.. ఆ టార్గెట్ ను 3 రోజుల్లోనే ఫినిష్ చేసింది ఈ చిత్రం. ఇక 17 రోజులు పూర్తయ్యేసరికి ఏకంగా 49.02 కోట్ల షేర్ ను రాబట్టి.. ఇప్పటికీ స్ట్రాంగ్ గా రన్ అవుతోంది.దీంతో 28.02 కోట్ల లాభాలను బయ్యర్లకు అందించింది ఈ చిత్రం. 3వ వీకెండ్ ను కూడా ఈ చిత్రం బాగా క్యాష్ చేసుకుంది.నిన్నటితో ఈ చిత్రం 49.02 కోట్ల షేర్ ను రాబట్టి.. ఫిబ్రవరిలో విన్నర్ అయిన ‘మిర్చి'(48.5 కోట్ల షేర్) కలెక్షన్లను అధిగమించింది.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి....

మరింత సమాచారం తెలుసుకోండి: