అందం, అభినయం రెండూ కలిసి ఉన్న హీరోయిన్లలో
కీర్తి సురేష్ ఒకరు.
నేను శైలజ మూవీతో హీరోయిన్గా తెలుగులోకి పరిచయమైన
కీర్తి సురేష్.. ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో పలు చిత్రాల్లో నటించారు. మహానటి సినిమాకు
కీర్తి సురేష్ కి జాతీయ అవార్డు కూడా వచ్చింది.ఇక ఈ
సినిమా తర్వాత
కీర్తి సురేష్ కి సరైన హిట్ ఒక్కటి కూడా రాలేదు. చివరి సంవత్సరం వచ్చిన పెంగ్విన్ , మిస్
ఇండియా సినిమాలు ఓటిటి లో విడుదలయ్యాయి. కానీ ఈ రెండు సినిమాల్లో ఒక్క సినిమాకి కూడా మంచి స్పందన రాలేదు.అలాగే అంతకుముందు థియేటర్స్ లో విడుదలైన సినిమాలు కూడా సరిగ్గా ఆడలేదు. అయితే ఇప్పుడు
కీర్తి సురేష్ వరసగా సినిమాలు చేస్తుంది. ఇక
కీర్తి ప్రస్తుతం
నితిన్ తో కలిసి రంగ్ దే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకి
వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. దేవి శ్రీ
ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలోని ఒక పాట ఇప్పటికే విడుదలై మంచి స్పందన తెచ్చుకుంది. ఇక
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాలో
కీర్తి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ
సినిమా షూటింగ్ త్వరలోనే మొదలుకాబోతుంది.
గీత గోవిందం సినిమాతో మంచి పెరు తెచ్చుకున్న పరుశురాం ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమాలు కాకుండా ఆమె గుడ్ లక్ సఖి
సినిమా కూడా రిలీజ్ డేట్ విడుదల చేసారు. అయితే
కీర్తి సురేష్ వరసగా ప్లాప్స్ వస్తున్న కూడా ఇన్ని భారీ సినిమాలు చేస్తూ దూసుకెళ్తుంది. ఆమె నటిస్తున్న
నితిన్ రంగ్ దే
సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. ఈ
సినిమా పాటలకు , టీజర్ కి మంచి స్పందన వచ్చింది. ఇక
మహేష్ బాబు తో చేస్తున్న సర్కారు వారి పాట
సంక్రాంతి కి విడుదల కాబోతుంది.