‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఓవర్ నైట్ లో క్రేజ్ తెచ్చుకున్నాడు దర్శకుడు సందీప్ వంగ. ఈ యంగ్ డైరెక్టర్ ఇదే సినిమాను బాలీవుడ్ కు తీసుకువెళ్లి అక్కడ సాలిడ్ హిట్ ను అందుకున్నాడు. ప్ర‌స్తుతం ఎనిమ‌ల్ చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ డైరెక్ట‌ర్ న్యూఇయ‌ర్ సంద‌ర్భంగా ఎనిమ‌ల్ చిత్రాన్ని ప్ర‌క‌టిస్తూ విడుద‌ల చేసిన వీడియో అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ర‌ణ్ బీర్ క‌పూర్ టైటిల్ రోల్ చేస్తున్నాడు. గుల్ష‌న్ కుమార్‌-టీ సిరీస్ స‌మ‌ర్పిస్తున్న ఈ చిత్రంలో అనిల్ క‌పూర్, బాబీడియోల్‌, ప‌రిణీతి చోప్రా ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.అయితే కబీర్ సింగ్ సినిమా తర్వాత తెలుగు హీరోలతో సినిమా చేయాలనీ సందీప్ ప్రయత్నించాడు. కానీ సందీప్ కథను ఏ హీరో కూడా యాక్సప్ట్ చేయలేదు.  మ‌హేశ్‌, ప్రభాస్ తో పాటు మరికొందరు సందీప్ చెప్పిన క‌థ‌పై ఆసక్తి చూపన‌ట్టు కానీ ఎందుకో సినిమాను పట్టాలెక్కించడానికి మాత్రం అలోచించి ఆగిపోయినట్టు  ఫిలిం నగర్లో గుసగుసలు వినిపించాయి.  అయితే ఎనిమల్ సినిమాను భారీగా ప్లాన్ చేస్తున్నాడట సందీప్. ఇక ఎనిమల్ సినిమాని వచ్చే సంవత్సరం దసరా కి ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమా మీద ఇండియా అంత భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాని సందీప్ రెడ్డి వంగా కూడా నిర్మాతలతో ఒకరిగా ఉన్నారు. ఇక ఇప్పుడు అందరిలోనూ వచ్చే ప్రశ్న ఏంటి అంటే ఇంక సందీప్ రెడ్డి వంగా తెలుగులో సినిమాలు చేయడం ఆపేసారా అని సందేహాలు వస్తున్నాయి.ఎందుకంటే వరసగా హిందీలో భారీ సినిమాలు చేస్తున్న సందీప్ రెడ్డి వంగా ఇప్ఫడు మళ్ళీ తెలుగులో కి వచ్చి మళ్ళీ చిన్న సినిమాలు చేయగలడా అని డౌట్స్ వస్తున్నాయి. అయితే ఈ విషయం మీద ఇంకా ఎలాంటి వార్తలు బయటకి రాలేదు కానీ సందీప్ రెడ్డి వంగా మాత్రం ఇప్పట్లో మళ్ళీ తెలుగు సినిమా చేసేలాగా కనపడట్లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: