ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. సూపర్ స్టార్ మహేష్ బాబు గతేడాది "సరిలేరు నీకెవ్వరూ" సినిమాతో మాంచి మాస్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా చాన్నాళ్ళ తరువాత మహేష్ కి మంచి మాస్ హిట్ ఇచ్చింది. ఇక ప్రస్తుతం ఎన్నో అంచనాలతో "సర్కారు వారి పాట " సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని "గీతా గోవిందం" ఫేమ్ పరశురామ్ పెట్ల డైరెక్ట్ చేస్తున్నాడు..ఎప్పట్నుంచో మహేష్ బాబు అభిమానిగా ఇండస్ట్రీలో ఉంటూ ఇన్నాళ్లకి మహేష్ బాబుని డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చిందని చెప్పడంతో ఫ్యాన్స్ అందరూ ఆ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. అంతేకాదు, ఒక్కడు సినిమా చూసిన తర్వాత మహేష్ బాబుతో ఒక్కసినిమా అయినా చేయాలని ఇండస్ట్రీకి వచ్చానని డైరెక్టర్ పరుశురామ్ చాలా సందర్భాల్లో అన్నాడు కూడా.అందుకే, ఇప్పుడు సినిమా స్క్రిప్ట్ పై మరింత హార్డ్ వర్క్ చేసి షూటింగ్ కి రెడీ అయ్యాడు. ప్రస్తుతం దుబాయ్ లో షూటింగ్ చేస్కుంటున్న ఈ సినిమా నెక్ట్స్ హైదరాబాద్ లో కీలకమైన సన్నివేశాలని తీసేందుకు రెడీ అయ్యింది.

ఈ టైమ్ లో పరుశురామ్సినిమా ప్రమోషన్స్ ని కూడా ముందుగానే ఊహించి మేకింగ్ షాట్స్ లో మహేష్ చెప్పే డైలాగ్స్, అలాగే మహేష్ బాబు స్పాట్ లో ఎలా ఉంటారు అనేదాన్ని షూటింగ్ చేస్తున్నట్లుగా సమాచారం తెలుస్తోంది.దీన్ని మహేష్ బాబు ఫ్యాన్స్ కోసం సర్ ప్రైజ్ గా సినిమా కంటే ముందే రిలీజ్ చేస్తారట. ఇక ఫ్యాన్స్ అంచనాలకి ఏమాత్రం తగ్గకుండా సినిమాని తెరకెక్కించేందుకు చూస్తున్నాడని అంటున్నారు. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాలపై ఈ సినిమా కథాంశం ఉండబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో పక్కా మాస్ లుక్ లో మహేష్ బాబు ఫ్యాన్స్ ని అలరించబోతున్నాడు. ఈ సినిమా ఖచ్చితంగా "ఒక్కడు" లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని పరశురామ్ భావిస్తున్నాడు. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...


మరింత సమాచారం తెలుసుకోండి: