స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత ఏడాది మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో "అల వైకుంఠపురంలో" సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.. ఇక ఆ సినిమా తరువాత టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో "పుష్ప" మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.ఆగస్టు 13న సినిమాను రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. సుకుమార్ నాన్ స్టాప్ గా అసలు విరామం తీసుకోకుండా ఈ సినిమా కోసం పని చేస్తున్నాడట.ఖచ్చితంగా ఈ సినిమాతో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని అటు సుకుమార్ తో పాటుగా బన్నీ కూడా తెగ కష్టపడుతున్నాడని సమాచారం అందుతుంది..ఇదిలా ఉండగా.. పెద్ద పెద్ద సినిమాలన్నీ కూడా రిలీజ్ డేట్లను ప్రకటించేస్తున్నాయి. ఇప్పుడు సుకుమార్ ఆగస్టు నెలను వదులుకుంటే రిలీజ్ డేట్ సమస్య ఏర్పడుతుంది. అందుకే దర్శకుడు సుకుమార్ పై పరోక్షంగా ఒత్తిడి పెంచుతున్నాడట హీరో అల్లు అర్జున్.తన తదుపరి సినిమా విడుదల తేదీని ప్రకటించాలని బన్నీ ఆలోచిస్తున్నాడట.


ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన తరువాతి సినిమాని క్లాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నారు. నిజానికి ఇంకా ఈ సినిమా కథ సిద్ధంగా లేదు. కానీ బన్నీ మాత్రం 2022 వేసవికి సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటన ఇవ్వాలని నిర్ణయించుకున్నాడట. ఏదైనా మంచి రోజు చూసి ఈ ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక అందువల్ల సుకుమార్ ని బన్నీ తెగ ఒత్తిడి చేస్తున్నాడట.ఇక కొరటాల కూడా తన ఆచార్య సినిమా పూర్తి చేసుకోని మహేష్ తో సినిమా చెయ్యడానికి మంచి కథని సిద్ధం చేసుకున్నాడట..ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: