ఇప్పటికే త్రివిక్రమ్ తో అరవింద సమేత సినిమా ను చేసిన ఎన్టీఆర్ రెండో సినిమా అయన తో చేయడం విశేషం. తొలి చిత్రం నువ్వే నువ్వే తోనే డైరెక్టర్ గా తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్నాడు త్రివిక్రమ్.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వంటి స్టార్ లతో సినిమా చేసే స్థాయికి ఎదిగాడు.. తన సినిమాల్లో యాక్షన్ కంటే ఎక్కువగా కామెడీ నే ప్రధానంగా ఉంటుంది.. స్టార్ హీరోలను యాక్షన్ సినిమాల్లోనే చూసే ప్రేక్షకులు త్రివిక్రమ్ రాకతో కామెడీ చేయడం కూడా చూశారు..ఇకపోతే ఈ సినిమా గురించి రోజుకో వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. ముఖ్యంగా ఈ చిత్రంలో నటించే హీరోయిన్ పై ఇప్పటికే అనేక రూమర్స్ వినిపించాయి. మొదట జాన్వీ కపూర్ ను ఫిక్స్ చేయనున్నారని అన్నారు.
మళ్ళీ పూజా హెగ్డే అయితే బాగుంటుందని త్రివిక్రమ్ ఫీల్ అవుతున్నాడని ఆ తరువాత వార్తలు వచ్చాయి.అయితే తాజాగా ఈ సినిమాలో కూడా రష్మిక మండన్నానే హీరోయిన్ గా అనుకుంటున్నారట. ఏది ఏమైనా ఇప్పుడు స్టార్ హీరోలు, మీడియమ్ రేంజ్ హీరోలు కొత్త సినిమా అనుకుంటున్నారు అనగానే ముందుగా కథానాయికల లిస్టులో రష్మిక మందన్న పేరు చేరిపోతోంది. అయితే ఈ వార్తకు సంబంధించి ఎలాంటి అప్ డేట్ లేదు. చూడాలి ఈ సినిమాలో ఎవర్ని హీరోయిన్ గా తీసుకుంటారో.కాగా హారికా హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘అయినను పోయి రావలె హస్తినకు’ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ పెట్టాలనుకుంటున్నారు.