అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా బోయపాటి శ్రీను కు వినయ విధేయ రామ రూపంలో పెద్ద షాక్ తగిలిందని చెప్పొచ్చు.. సినిమా సంగతి ఎలా ఉన్నా యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం అదిరిపోయాయి.అయితే తన విధేయత ని నిరుపించుకోవడానికి మళ్ళీ బాలయ్య తో చేతులు కలిపాడు.. .వీరి కాంబో లో వచ్చిన సింహ, లెజెండ్ సినిమా లు సూపర్ హిట్ కాగా ఈ సినిమా పై కూడ మంచి అంచనాలున్నాయి.. ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తుండగా.. అందులో ఒకటి అఘోర పాత్ర.. రెండోది ఫ్యాక్షనిస్ట్ పాత్ర అని సమాచారం. ఇకపోతే బాలయ్య తాజాగా ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడట.
ఫ్లాపుల్లో ఉన్న ఓ దర్శకుడికి అవకాశం ఇచ్చాడట. ఆ దర్శకుడు ఎవరో కాదు.. శ్రీవాస్. బాలకృష్ణతో ఇది వరకు `డిక్టేటర్` తీశాడు శ్రీవాస్. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఇటీవల బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో `సాక్ష్యం` తెరకెక్కించాడు. అది కూడా ఫట్టుమంది. అయితే గత కొంతకాలంగా బాలయ్య కోసం ఓ కథ రెడీ చేసుకుని, ఆయన చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాడు శ్రీవాస్. ఇప్పుడు తన కథనీ ఓకే చేసేశాడట. అయితే ఇది ఎప్పుడు తెరకెక్కుతుందో తెలీదు. ఎందుకంటే, గోపీచంద్ మలినేనితో ఓ సినిమా చేస్తానని బాలయ్య ఫిక్స్ అయ్యాడు మైత్రీ మూవీస్ సంస్థ ఈచిత్రాన్ని తెరకెక్కిస్తుంది. ఆ తరవాతే.. శ్రీవాస్ సినిమా ఉంటుంది.