తెలుగు బుల్లితెరపై మకుటంలేని మహారాణి యాంకర్ సుమ కనకాల. తన మాటలతో పిల్లలు పెద్దలు  అనే భేదం లేకుండా అందర్నీ ఆకట్టుకోవడం లో దిట్ట. తెలుగు బుల్లితెర  ప్రేక్షకులలో ఆమె తెలియని వారు లేరంటే అదే అతిశయోక్తి కాదు. దూరదర్శన్ లో సీరియల్ తో పరిచయం అయిన  యాంకర్ సుమ  ప్రస్తుతం కెరీర్ ను నెట్టుకొస్తోంది. గత సంవత్సరం యాంకర్ సుమ ఇంట్లో వరుసగా విషాదాలు చోటు చేసుకున్నాయి.  అవి ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం.


 సుమ కనకాల భర్త ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల. రాజీవ్ కనకాల చెల్లి  శ్రీ లక్ష్మి కనకాల  గత సంవత్సరం మృతి చెందారు.  ప్రముఖ నటుడు అయినటువంటి దర్శకుడు దేవదాస్ కనకాల కు శ్రీ లక్ష్మీ కనకాల ఏకైక కుమార్తె.అన్నా,  తండ్రి బాటలోనే శ్రీలక్ష్మి కూడా అందరికీ నటిగా పరిచయం.


  కాన్సర్ తో బాధపడుతున్న శ్రీలక్ష్మి  హైదరాబాద్ ప్రైవేట్ హాస్పిటల్ లో  చికిత్స తీసుకున్నారు. అయితే చికిత్స తీసుకుంటున్న సమయంలో నే  ఆమె తుది శ్వాస విడిచారు. సోదరి శ్రీ లక్ష్మీ మరణ వార్త విన్న రాజీవ్ కనకాల, సుమ కనకాల కన్నీరు మున్నీరయ్యారు. రాజీవ్ కనకాల ఇంట్లో వరుసగా మూడవ ఏడాది విషాదం చోటుచేసుకుంది. 2018  లో రాజీవ్ కనకాల తల్లి, దేవదాస్ కనకాల భార్య లక్ష్మీదేవి కనకాల స్వర్గస్తులయ్యారు.  భార్య మరణించిన ఏడాదికే దేవదాస్ కూడా మరణించారు. ఇప్పుడు శ్రీలక్ష్మి మరణంతో రాజు సుమ కుటుంబ సభ్యులు విషాదఛాయలు అలుముకున్నాయి.


 శ్రీలక్ష్మి చాలా సీరియల్స్ లో నటించింది.  చిన్నప్పటి నుంచి చదువులో ముందున్న శ్రీలక్ష్మి డాక్టర్ అవ్వాలని అనుకుంది. దూరదర్శన్ లో వచ్చిన రాజశేఖర చరిత్రము అనే ధారావాహిక ద్వారా టీవీ రంగంలోకి ప్రవేశించింది శ్రీలక్ష్మి. దాని తర్వాత కన్నడ హిందీ చిత్రాల్లో నటించింది. శ్రీ లక్ష్మి నటించిన అగ్ని పూలు  సీరియల్ లోని పాత్ర తనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది కూడా . ఈటీవీ లో చాలా ఫేమస్ సీరియల్ అయినా ఋతురాగాలు సీక్వెల్ గా రుతుధార లో కూడా శ్రీ లక్ష్మీ నటించింది. ఇలా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఇంత చిన్న వయసులో చనిపోయారు. ఈమెకు ఒక పాప కూడా ఉంది. ఆ పాప ప్రస్తుతం సుమ కనకాల వద్దనే ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: