ఇస్మార్ట్ రామ్ ఇప్పుడు మంచి దూఉకుడు మీద ఉన్నాడు. పూరీ డైరక్షన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ తో హిట్ ట్రాక్ ఎక్కిన రామ్ సంక్రాంతికి వచ్చిన రెడ్ సినిమాతో కూడా మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత కోలీవుడ్ స్టార్ డైరక్టర్ లింగుసామితో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు ఉస్తాద్ రామ్. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.

ఇక రామ్సినిమా తర్వాత మరోసారి ఇస్మార్ట్ జోడీ ఫిక్స్ చేసుకున్నాడని తెలుస్తుంది. ఇస్మార్ట్ జోడీ అంటే ఇస్మార్ట్ శంకర్ డైరక్టర్ పూరీతో సినిమా అన్నమాట. ఆల్రెడీ ఇస్మార్ట్ శంకర్ టైం లోనే డబుల్ ఇస్మార్ట్ అనే పోస్టర్ వైరల్ అయ్యింది. అయితే ఆ సినిమా నిజంగానే కార్యరూపం దాల్చబోతుందని తెలుస్తుంది. రామ్ ఇస్మార్ట్ శంకర్ సీక్వల్ గా డబుల్ ఇస్మార్ట్ రాబోతుంది. ప్రస్తుతం పూరీ విజయ్ దేవరకొండతో లైగర్ సినిమా చేస్తున్నాడు.

సినిమా తర్వాత పూరీ రామ్ కలిసి డబుల్ ఇస్మార్ట్ చేస్తారని టాక్. ఆ సీక్వల్ కోసం పూరీ ఇప్పటికే స్టోరీ సిద్ధం చేశాడని తెలుస్తుంది. లింగుసామి సినిమా కూడా రామ్ కు కొత్త ఎనర్జీ ఇవ్వనుంది. మొత్తానికి ఇనాళ్లకు రామ్ కోరుకునే మాస్ ఇమేజ్ వచ్చేసింది. ఇక అందుకు తగినట్టుగా కథలు ఎంచుకుని సినిమాలు చేస్తే బెటర్ గా ఉంటుంది. తప్పకుండా రామ్ డబుల్ ఇస్మార్ట్ మళ్లీ మరో సెన్సేషనల్ మూవీ అవుతుందని అంటున్నారు ఆడియెన్స్. రామ్ కూడా ఇక మీదట కెరియర్ విషయంలో చాలా ఫోకస్ గా ఉండాలని ఫిక్స్ అయ్యాడు. ప్రస్తుతం హిట్ ట్రాక్ కొనసాగిస్తున్న రామ్ అదే ఫాం కొనసాగించాలని చూస్తున్నాడు.                            

మరింత సమాచారం తెలుసుకోండి: