రెబల్ స్టార్ ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా తర్వాత సలార్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా  ఘనంగా ప్రారంభమవగా ఈ కార్యక్రమానికి యష్ ముఖ్య అతిధిగా వచ్చాడు. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా లో శృతిహాసన్ కథానాయికగా నటిస్తుంది. శెరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ని వేసవికి కి కానీ దసరా కి కానీ రిలీజ్ చేయాలనీ చూస్తున్నారు..  బాహుబలి తో నేషనల్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ఈ చిత్రాన్ని కూడా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తుండడం విశేషం..

అయితే ప్రభాస్ సినిమాలు బాలీవుడ్ హీరోలకు చెమటలు పట్టిస్తున్నాయట.. ఒకప్పుడు తెలుగు సినిమా వేరు, ఇప్పుడు వేరు అన్నట్లుగా అయ్యింది మార్కెట్. చిన్న హీరోలు సైతం బాలీవుడ్ లో బాక్సాఫీస్ దగ్గర తొడలు కొడుతున్నారు. అక్కడ స్టార్ హీరోలకి, కపూర్స్ కి, ఖాన్స్ కి షాక్ ఇస్తున్నారు. ముఖ్యంగా బాహుబలి సినిమా తర్వాత తెలుగు సినిమా మార్కెట్ పెరిగిందనే చెప్పాలి. సైరాతో మెగాస్టార్, సాహో తో మరోసారి రెబల్ స్టార్ ఇద్దరూ కూడా అక్కడ మార్కెట్ ని కుమ్మేశారు. అంతేకాదు, కుర్రహీరోల సినిమాలు సైతం డబ్బింగ్ అయ్యి యూట్యూబ్ ని షేక్ చేస్తున్నాయి. ఈ తరుణంలో రాబోతున్న ప్రభాస్ సినిమాలు బాలీవుడ్ బడా హీరోలని సైతం భయపెడుతున్నాయి.

సాహో సినిమా తర్వాత ల్యాంగ్ గ్యాప్ లో రాధేశ్యామ్ అంటూ ప్రభాస్ వస్తున్నాడు. ఈ సినిమా ఇప్పుడు బాలీవుడ్ ని షేక్ చేసేందుకు రెడీ అవుతోంది. రాధేశ్యామ్ తర్వాత కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో తీస్తున్న సలార్ అయితే దడపుట్టించేస్తోంది. ఎందుకంటే, ఆల్రెడీ కేజీఎఫ్ కి బాలీవుడ్ లో భారీ డిమాండ్ ఉంది. అదే సినిమా డైరెక్టర్ అందులోనూ ప్రభాస్ తో చేస్తున్న యాక్షన్ సినిమా కాబట్టి బాలీవుడ్ కి చెమటలు పట్టేస్తున్నాయి.ముందుగానే ప్రభాస్ మార్కెట్ ని ఊహించి మరీ ఓంరౌత్ మైథలాజికల్ మూవీకి రెడీ అయ్యాడు. ఆది పురుష్ సినిమా కూడా మంచి టాక్ వచ్చిందంటే ప్రభాస్ కి అక్కడ పూజలు చేసేస్తారు నో డౌట్.  ఈ మూడు సినిమాలు ఒక ఎత్తు అయితే, నాగ్ అశ్విన్ తో కమిట్ అయిన సినిమా మరో ఎత్తు. ఈ సినిమా సైన్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని ముందుగానే చెప్పారు. టైమ్ మిషన్ బ్యాక్ డ్రాప్ లో ఉంటే బాలీవుడ్ కి చాలా ఈజీగా కనెక్ట్ అయిపోతుంది. అందులోనూ ఏమాత్రం పాజిటివ్ టాక్ సినిమాకి వచ్చినా ఒక రేంజ్ మార్కెట్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: