అక్కినేని హీరో నాగ చైతన్య హిట్లు , ఫ్లాప్ లతో సంభందం లేకుండా వరుస సినిమాలు చేస్తూ పోతున్నాడు. అయన నటించిన గత చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశ పరిచాయి. మజిలీ సినిమా తో పర్వాలేదనిపించినా వెంకీ మామ చిత్రం మాత్రం ప్రేక్షకులను నిరాశనే మిగిల్చింది. అంతకుముందు కూడా చైతు భారీ ఫ్లాప్లనే మూటగట్టుకున్నాడు.. ఇక ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రాబోతున్న లవ్ స్టోరీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు..

సాయి పల్లవి హీరోయిన్ గా నటించబోతున్న ఈ సినిమా టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.  టీజర్ తో సినిమా పై అంచనాలు పెంచేలా చేశాడు చైతు.. ఈ సినిమా ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరుపుకుంటుంది. తాజాగా రిలీజ్ అయిన  'దాని పేరే సారంగదరియా..' అనే పాట సూపర్ అయ్యింది. ఈ పాటలో  సాయిపల్లవి డ్యాన్స్‌, ఎక్స్‌ప్రెషన్స్‌ ఎన్నిసార్లు చూసినా మళ్లీమళ్లీ చూడాలనిపిస్తోందని అభిమానులు నెట్టింట కామెంట్లు చేస్తున్నారు.ప్రస్తుతం ఈ సాంగ్‌ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. పాటే ఇంత బాగుంటే సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందోనని సినిమా రిలీజ్‌ అయ్యే ఏప్రిల్‌ 16 కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

'ఫిదా' వంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించిన చిత్రం కావడంతో ఈ 'లవ్‌ స్టోరీ' మీద భారీ అంచనాలే నెలకొన్నాయి. అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా రైట్స్‌ కూడా భారీ ధరకు అమ్ముడైనట్లు సమాచారం. ఆంధ్రా హక్కులు రూ.15 కోట్లకు అమ్ముడుపోగా ఓవర్సీస్‌ హక్కులు రూ.6 కోట్లకు అమ్ముడైనట్లు టాక్‌ వినిపిస్తోంది. నైజామ్‌లో కూడా మంచి ధర పలికేది కానీ ఇక్కడ ఆసియన్‌ మూవీస్‌ సొంతంగా రిలీజ్‌ చేస్తుందట. మొత్తం‌గా ఈ సినిమా అప్పుడే 50 కోట్ల రూపాయల బిజినెస్‌ చేసినట్లు సమాచారం. ఇవి కేవలం థియేట్రికల్‌ బిజినెస్‌ మాత్రమే కాగా, ఇవి కాకుండా నాన్‌ థియేటర్‌ హక్కులు ఉండనే ఉన్నాయి. మరి ఓవరాల్‌గా ఈ సినిమా ఎంత మార్కెటింగ్‌ చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: