ఈ సీజన్ లో మొత్తం 19 మంది కంటెస్టెంట్లు పాల్గొనగా.. అందరూ ఊహించినట్లుగానే అభిజీత్ టైటిల్ని గెలుచుకోగా అఖిల్ సార్థక్ రన్నరప్గా నిలిచాడు. బిగ్బాస్ షో ముగిసి రెండు నెలలు పూర్తి కావస్తున్నా ఏదో ఒక విషయంలో రోజూ వార్తల్లో నానుతూనే ఉంది. ఓవైపు ప్రేక్షకులకు వినోదం పంచుతూనే మరోవైపు ఇందులో పాల్గొంటున్న వారికి మంచి ఆఫర్లు తెచ్చిపెడుతోంది. ఇంతకు ముందు సీజన్లలో కంటే బిగ్బాస్4లో పాల్గొన్న వారు మాత్రం ఈ షో ద్వారా లభించిన ఫేమ్ను బాగా ఉపయోగించుకుంటున్నారు.
ఇప్పటికే చాలా మంది సినిమా అవకాశాలతోపాటు పలు బుల్లితెర కార్యక్రమాల్లో పాల్గొనే ఛాన్స్ సొంతం చేసుకున్నారు. వీరిలో వ్యక్తిక్తంతో అందరికంటే ఎక్కువ పాపులారీటిని సొంతం చేసుకున్న సోహైల్ ఓ సినిమాను కమిట్ అయిన విషయం తెలిసిందే. మోనాల్ గజ్జర్ ఇప్పటికే అల్లుడు అదుర్స్లో ప్రత్యేక పాటలో మెరిసింది. మరో చిత్రంతో కూడా చర్చలు జరుపుతోంది.కుర్రకారుల మనస్సును కొల్లగొట్టిన ఈ బ్యూటీ ఓంకార్ డ్యాన్స్ ప్లస్ షోలో జడ్జిగా చేస్తోంది. అఖిల్ సార్థక్తో ఓ వెబ్ సిరీస్ చేస్తున్నట్లు ఇదివరకే ప్రకటించింది. కాగా, ‘తెలుగు అబ్బాయి గుజరాత్ అమ్మాయి' అనే టైటిల్తో వస్తున్న దీన్ని సరస్వతి క్రియేషన్స్ బ్యానర్పై భాస్కర్ బంతుపల్లి తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఇన్స్టాగ్రామ్లో తను చేసిన పోస్ట్ ఇప్పుడు అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. డ్యాన్స్ షో ఎపిసోడ్ కోసం ఏకంగా 21 గంటలు షూటింగ్ చేసినట్లు వెల్లడించింది. అంతసేపు కష్టపడినా ఇప్పటికీ ఎంత ఫ్రెష్గా ఉన్నానో అంటూ ఓ వీడియోను ఇన్స్టా స్టోరీస్లో యాడ్ చేసింది. ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ మోనాల్ ఓపిక, సహనానికి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.