టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరైన
ప్రభాస్ ఏడాదిన్నర క్రితం
సాహో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ తరువాత రాధేశ్యామ్
మూవీ షూటింగ్ లో జాయిన్ అయిన
ప్రభాస్, దానితో పాటు ప్రస్తుతం ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్, అలానే
కెజిఎఫ్ సినిమాల దర్శకుడు
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమాలు చేస్తున్నారు. అయితే వీటిలో రాధేశ్యామ్ షూట్ చివరిదశలో ఉండగా ఆదిపురుష్, సలార్ సినిమాలకు గాను
ప్రభాస్ వరుసగా షెడ్యూల్స్ లో పాల్గొంటున్నట్లు టాక్. ఇక ముఖ్యంగా ప్రస్తుతం
ప్రభాస్ నటిస్తున్న ఈ మూడు సినిమాల్లో సలార్ పై ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి.
తొలిసారిగా
ప్రశాంత్ నీల్ తో చేస్తున్న
సినిమా కావడంతో అదీకాక
బాహుబలి తో
ప్రభాస్,
కెజిఎఫ్ తో
ప్రశాంత్ ఇద్దరూ కూడా పాన్
ఇండియా స్థాయిలో ఇమేజ్ ని దక్కించుకోవడం అలానే ఈ ఇద్దరు సలార్ కోసం పని చేస్తుండడంతో దీనిపై ఆ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి.
శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి
రవి బస్రూర్ సంగీతాన్ని అందిస్తుండగా ప్రఖ్యాత నిర్మాణ సంస్థ హోంబలె ఫిలిమ్స్ వారు దీనిని దాదాపుగా రూ.500 కోట్ల రూపాయల భారీ వ్యయంతో పాన్
ఇండియా మూవీగా ఎంతో గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నట్లు టాక్. ఇప్పటికే తొలి షెడ్యూల్ జరుపుకున్న ఈ
మూవీ యొక్క తదుపరి షెడ్యూల్
హైదరాబాద్ లో జరుగనున్నట్లు సమాచారం.
మంచి యాక్షన్ తో కూడిన
మాస్ ఎంటెర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో
కన్నడ తో పాటు
బాలీవుడ్, తెలుగు చిత్ర పరిశ్రమలకు చెందిన పలువురు దిగ్గజ నటులు కీలక పాత్రలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమాని ఎంత ధర అయినా ఇచ్చి కొనేందుకు పలువురు బయ్యర్లు అప్పుడే సిద్ధమవుతున్నారని, వచ్చే ఏడాది ఏప్రిల్ 14న రిలీజ్ కానున్న ఈ
మూవీ యొక్క థియేట్రికల్ రైట్స్ తమకంటే తమకు కావాలని మరికొందరు అయితే గట్టిగా పోటీ పడుతున్నట్లు చెప్తున్నారు. నిజంగా ఇది సలార్ గురించి షాకింగ్ న్యూస్ అని, అయితే దీని యొక్క రైట్స్ అమ్మడానికి మరికొంత సమయం ఉందని యూనిట్ చెప్తున్నట్లు టాక్.....!!