సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సూపర్ హీరోయిన్ కీర్తి సురేష్ ఆయనకు జోడీగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట. 14 రీల్స్, మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ మూవీకి థమన్ మ్యూజిక్ అందిస్తుండగా మది ఫొటోగ్రఫి అందిస్తున్నారు. ఇటీవల దుబాయ్ లో తొలి షెడ్యూల్ జరుపుకున్న ఈ మూవీ లో ఒక ప్రముఖ కోలీవుడ్ నటుడు విలన్ పాత్ర చేస్తున్నట్లు టాక్. సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక ఫైనాన్షియర్ పాత్ర చేస్తున్నారని, అలానే కీర్తి సురేష్ బ్యాంకు ఉద్యోగిని పాత్ర చేస్తున్న ఈ మూవీ బ్యాంకింగ్ రంగంలోని మోసాలను బేస్ చేసుకుని తెరకెక్కుతోందని అంటున్నారు.

ఇక సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకునే విధంగా దర్శకుడు పరశురామ్ ఈ మూవీని ఎంతో జాగ్రత్తగా తీస్తున్నారట. ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ యొక్క ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్  ప్రేక్షకాభిమానులు అందరిలో భారీ అంచనాలు క్రియేట్ చేసింది. అసలు మ్యాటర్ ఏమిటంటే ఈ మూవీ యొక్క తదుపరి షెడ్యూల్ ని అమెరికా లో ప్లాన్ చేశారట యూనిట్. అయితే యూనిట్ లోని కొందరికి వీసాలు ఇంకా జారీ కాకపోవడంతో దానిని మరొక్కసారి దుబాయ్ కి షిఫ్ట్ చేసారని అంటున్నారు. 

నిజానికి చాలారోజుల క్రితం అమెరికా వీసాల కోసం సర్కారు వారి పాట యూనిట్ దరఖాస్తు చేసుకున్నప్పటికీ కొన్ని కారణాల వలన అవి మరింత ఆలస్యం అయ్యాయని, దానితో మరొక్కసారి యూనిట్ దుబాయ్ కి వెళ్లనుందని అంటున్నారు. మొత్తంగా చూస్తుంటే పాపం ఆదిలోనే సర్కారు వారి పాట షూటింగ్ కి ఈ విధంగా అడ్డంకులు ఎదురవుతుండడం కొంత విచారకరం అయినప్పటికీ మూవీ తప్పకుండా రిలీజ్ తరువాత ఈ మూవీ సూపర్ హిట్ కొట్టి తీరుతుందని పలువురు సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అబిప్రాయపడుతూ కామెంట్స్ చేస్తున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: