ఇక
సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకునే విధంగా దర్శకుడు
పరశురామ్ ఈ మూవీని ఎంతో జాగ్రత్తగా తీస్తున్నారట. ఇటీవల రిలీజ్ అయిన ఈ
మూవీ యొక్క ఫస్ట్ లుక్ మోషన్
పోస్టర్ ప్రేక్షకాభిమానులు అందరిలో భారీ అంచనాలు క్రియేట్ చేసింది. అసలు మ్యాటర్ ఏమిటంటే ఈ
మూవీ యొక్క తదుపరి షెడ్యూల్ ని
అమెరికా లో ప్లాన్ చేశారట యూనిట్. అయితే యూనిట్ లోని కొందరికి వీసాలు ఇంకా జారీ కాకపోవడంతో దానిని మరొక్కసారి
దుబాయ్ కి షిఫ్ట్ చేసారని అంటున్నారు.
నిజానికి చాలారోజుల క్రితం
అమెరికా వీసాల కోసం సర్కారు వారి పాట యూనిట్ దరఖాస్తు చేసుకున్నప్పటికీ కొన్ని కారణాల వలన అవి మరింత ఆలస్యం అయ్యాయని, దానితో మరొక్కసారి యూనిట్
దుబాయ్ కి వెళ్లనుందని అంటున్నారు. మొత్తంగా చూస్తుంటే పాపం ఆదిలోనే సర్కారు వారి పాట షూటింగ్ కి ఈ విధంగా అడ్డంకులు ఎదురవుతుండడం కొంత విచారకరం అయినప్పటికీ
మూవీ తప్పకుండా రిలీజ్ తరువాత ఈ
మూవీ సూపర్ హిట్ కొట్టి తీరుతుందని పలువురు
సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ తమ సోషల్
మీడియా అకౌంట్స్ ద్వారా అబిప్రాయపడుతూ కామెంట్స్ చేస్తున్నారు.....!!