టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ ఇటీవల కెరీర్ పరంగా నటించిన వరుసగా మూడు సినిమాలతో మూడు సూపర్ డూపర్ హిట్స్ కొట్టి హ్యాట్రిక్ నమోదు చేసిన విషయం తెల్సిందే. కాగా ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమా సర్కారు వారి పాట. గీత గోవిందం ఫేమ్ పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. 14 రీల్స్ ప్లస్, మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంస్థలపై ఎంతో భారీగా తెరకెక్కుతున్న ఈ మూవీలో మహేష్ ఒక డిఫరెంట్ రోల్ చేస్తుండగా టాలీవుడ్, కోలీవుడ్ చిత్ర పరిశ్రమలకు చెందిన పలువురు దిగ్గజ నటులు కీలక పాత్రలు చేస్తున్నట్లు టాక్.

ఇక ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా దీని తరువాత టాలీవుడ్ ప్రఖ్యాత దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు ఒక సినిమా చేయనున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ తో ఆర్ఆర్ఆర్ అనే భారీ ప్రతిష్టాత్మక సినిమా తీస్తున్న రాజమౌళి, తన తదుపరి మూవీ మహేష్ తోనే అంటూ ఇటీవల అనౌన్స్ చేసారు. సీనియర్ ప్రొడ్యూసర్ కె ఎల్ నారాయణ ఎంతో భారీ ఖర్చుతో అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మిస్తున్న ఈ భారీ పాన్ ఇండియా మూవీ సౌత్ ఆఫ్రికా లోని అడవుల బ్యాక్ డ్రాప్ లో మంచి యాక్షన్ తో కూడిన కమర్షియల్ ఎంటెర్టైనెర్ గా తెరకెక్కనున్నట్లు టాక్. 

అయితే రాజమౌళి, మహేష్ తో చేస్తున్న సినిమా ఛత్రపతి శివాజీ జీవిత చరిత్ర అని మరికొందరు ప్రచారం చేస్తుంటే ఇంకొందరు వారిద్దరి సినిమా జేమ్స్ బాండ్ తరహాలో సాగె రా ఏజెంట్ మూవీ అని అంటున్నారు. మొత్తంగా ఈ ప్రతిష్టాత్మక మూవీ పై పలు మీడియా మాధ్యమాల్లో ఈ విధంగా పలు కథనాలు ప్రచారం అవుతుండడంతో, దీనిపై పక్కాగా యూనిట్ నుండి అధికారికంగా న్యూస్ బయటకు వచ్చే వరకు వీటిని విశ్వసించలేమని అంటున్నారు విశ్లేషకులు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: