టాలీవుడ్
సూపర్ స్టార్ మహేష్ ఇటీవల కెరీర్ పరంగా నటించిన వరుసగా మూడు సినిమాలతో మూడు సూపర్ డూపర్ హిట్స్ కొట్టి హ్యాట్రిక్ నమోదు చేసిన విషయం తెల్సిందే. కాగా ప్రస్తుతం ఆయన నటిస్తున్న
సినిమా సర్కారు వారి పాట.
గీత గోవిందం ఫేమ్
పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ
మూవీ లో
కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా
థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. 14 రీల్స్ ప్లస్, మైత్రి
మూవీ మేకర్స్,
జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంస్థలపై ఎంతో భారీగా తెరకెక్కుతున్న ఈ మూవీలో
మహేష్ ఒక డిఫరెంట్ రోల్ చేస్తుండగా
టాలీవుడ్,
కోలీవుడ్ చిత్ర పరిశ్రమలకు చెందిన పలువురు దిగ్గజ నటులు కీలక పాత్రలు చేస్తున్నట్లు టాక్.
అయితే
రాజమౌళి,
మహేష్ తో చేస్తున్న
సినిమా ఛత్రపతి శివాజీ జీవిత చరిత్ర అని మరికొందరు ప్రచారం చేస్తుంటే ఇంకొందరు వారిద్దరి
సినిమా జేమ్స్ బాండ్ తరహాలో సాగె
రా ఏజెంట్
మూవీ అని అంటున్నారు. మొత్తంగా ఈ ప్రతిష్టాత్మక
మూవీ పై పలు
మీడియా మాధ్యమాల్లో ఈ విధంగా పలు కథనాలు ప్రచారం అవుతుండడంతో, దీనిపై పక్కాగా యూనిట్ నుండి అధికారికంగా న్యూస్ బయటకు వచ్చే వరకు వీటిని విశ్వసించలేమని అంటున్నారు విశ్లేషకులు.....!!