వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా తో టాలీవుడ్ కి పరిచయమైనా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. తొలి సినిమా తోనే మంచి సక్సెస్ కొట్టిన రకుల్ ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు.. అనతి కాలంలో నే స్టార్ హీరోలతో నటిస్తూ టాప్ హీరోయిన్ అయిపొయింది.. ఎన్టీఆర్, మహేష్ వంటి స్టార్ హీరోలతో నటిస్తూ టాప్ హీరోయిన్ గా వెలుగొందింది.. ప్రస్తుతం తెలుగులో ఆమెనే టాప్ హీరోయిన్.. అయితే గత కొద్దీ కాలంగా రకుల్ కి మంచి అవకాశాలు రావట్లేదు.. పూజ హెగ్డే, రష్మిక మందన్న ఎంట్రీ తో ఆమెకు ఛాన్స్ లు తగ్గిపోయాయి..

ఇటీవలే విడుదల అయిన నితిన్ చెక్ సినిమా లో కనిపించిన రకుల్ కి ఆ సినిమా ద్వారా వచ్చిన ప్లస్ ల కంటే మైనస్ లే ఎక్కువ అని చెప్పాలి.. సినిమా ఫ్లాప్ కావడంతో రకుల్ కి ఏమంత పేరు కూడా రాలేదు. ఆమె చేతిలో వైష్ణవ్ రెండో సినిమా తప్పా ఏదీ లేదు.. ఈ నేపథ్యంలో ఆమె తన వ్యాపారం పై దృష్టి పెట్టింది. రకుల్ ప్రీత్ సింగ్ కేవలం సినిమాలతోనే కాకుండా ఆ ఆమధ్య పలు వ్యాపారులతో కూడా మంచి ఆదాయాన్ని వెనకేసుకుంది. పాతికేళ్ల వయసులోనే మంచి బిజినెస్ లతో ఇతరులకు స్ఫూర్తిగా నిలిచిన రకుల్ మొన్నటివరకు దారుణంగా నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే ఆమె నష్టపోయినా కూడా సంస్థలో పని చేసిన వారిని ఏ మాత్రం విడిచిపెట్టలేదు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు చేదు అనుభవాలపై రకుల్ స్పందించింది.

కుల్ హీరోయిన్ గా క్లిక్కయిన తరువాత F45 పేరుతో ఫిట్నెస్ సెంటర్స్ ను స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ లో అలా క్లిక్కయ్యిందో లేదో వెంటనే వైజాగ్ లో మరో బ్రాంచ్ ను ఓపెన్ చేసింది. ఇక ఆమె ఫిట్నెస్ సెంటర్స్ సంఖ్య ఎక్కువవుతున్న సమయంలో కరోనా లాక్ డౌన్ వలన మొన్నటివరకు బాగా నష్టాలు ఎదుర్కొందట.ఇక లాక్ డౌన్ లో సంస్థలో పని చేసిన ఎంప్లాయిస్ ను ఏ మాత్రం విడిచి పెట్టకుండా వాళ్ళకు ఎప్పటిలానే జీతాలు ఇస్తూ వచ్చిందట. నా బిజినెస్ ను కరోనా మహమ్మారి నన్ను తీవ్రంగా దెబ్బతీసిందని చెబుతూ.. చాలా కాలం తరువాత మళ్ళీ కష్టమర్స్ రాకతో పుంజుకున్నట్లు తెలిపింది. ఇప్పుడైతే.. యధావిధిగా ఎప్పటిలానే కొనసాగుతుందని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో రకుల్ వివరణ ఇచ్చింది.తమిళ్ లో ఇండియన్ 2లో కాజల్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న రకుల్ శివకార్తీకేయన్ తో కూడా ఒక సినిమా చేయడానికి ఒప్పుకుంది. అయితే ఇండియన్ 2 క్యాన్సిల్ అయినట్లు కొన్ని రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే.




మరింత సమాచారం తెలుసుకోండి: