రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.  ఇటీవలే వచ్చిన టీజర్ ఫ్యాన్ కి పండగ వాతావరణాన్ని నెలకొల్పింది.నిజానికి కొత్త సంవత్సరం రోజున ఈ సినిమా టీజర్ వస్తుందేమోనని ఎంతగానో ఎదురుచూశారు. దర్శకుడు హింట్ కూడా ఇచ్చాడు. కానీ అదీ ఎందుకు కుదరలేదు.  సంక్రాంతి కి కూడా ఎలాంటి అప్ డేట్ లేదు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ డిప్రషన్లో కి వెళ్లిపోయారు. కానీ చెప్పినట్లు ఫిబ్రవరి 14 న టీజర్ ని రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ సలార్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.  

కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా లో శృతిహాసన్ కథానాయికగా నటిస్తుంది. శెరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ని వేసవికి కి కానీ దసరా కి కానీ రిలీజ్ చేయాలనీ చూస్తున్నారు..  ఇక బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తో ఆదిపురుష్ సినిమా కూడా తెరకెక్కబోతుంది.. అంతేకాకుండా నాగ్ అశ్విన్ సినిమా కూడా లైన్ లోనే ఉంది. ఇంత రేంజ్ లో సినిమా లు చేసే హీరో బహుశా ఇండియా లో లేడనుకుంటా.. అందుకే కాబోలు ఇతర ఇండస్ట్రీ ల హీరోలు ప్రభాస్ ని చూసి అసూయపడుతున్నారు..

మరో పక్క ప్రభాస్ అన్నీ కూడా పాన్ ఇండియా కథలనే ఎన్నుకుంటున్నాడు. దానికి తగ్గట్లుగా మార్కెట్ జరగడం కోసం ఇతర భాషల నటీనటులను కూడా ప్రభాస్ సినిమాల్లో తీసుకుంటున్నారు దర్శకనిర్మాతలు. టాలీవుడ్, బాలీవుడ్, శాండల్ వుడ్ ఇలా దాదాపు అన్ని ఇండస్ట్రీలలో నటీనటులు ప్రభాస్ సినిమాల్లో కనిపిస్తున్నారు. కానీ కోలీవుడ్ మాత్రం ప్రభాస్ సినిమాలను ప్రోత్సహించడం లేదని తెలుస్తోంది. విజయ్ సేతుపతి లాంటి స్టార్లకు ప్రభాస్ సినిమాల్లో ఛాన్స్ వస్తే చేయొద్దని అక్కడ ఇండస్ట్రీ పెద్దలు సలహాలు ఇస్తున్నారట.రీసెంట్ గా కోలీవుడ్ హీరో అధర్వకి ప్రభాస్ సినిమాలో నటించే అవకాశం రాగా.. ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేయమంటూ కోలీవుడ్ దర్శకనిర్మాతలు కొందరు ఈ యంగ్ హీరోకి చెబుతున్నారట. తమ ఇండస్ట్రీకి చెందిన హీరోలు ప్రభాస్ సినిమాల్లో నటించకూడదంటూ రూల్స్ కూడా పెట్టుకుంటున్నారట. కానీ ఈ విషయాలను బయటకి రానివ్వకుండా పైకి మాత్రం ప్రభాస్ సినిమాలను ఎంకరేజ్ చేస్తున్నట్లు ప్రవర్తిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: