యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో సినిమా అంటే ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో ఎంతటి క్రేజ్ ఉంటుందో అందరికి తెలిసిందే. ప్రభాస్ తో సినిమా అంటే వందల కోట్ల బడ్జెట్ పెట్టాల్సిందే. అఫ్కోర్స్ ఎంత పెట్టినా తెచ్చి పెట్టే స్టామినా ఉందని ప్రూవ్ చేసుకున్నాడు కదా. బాహుబలితో తన స్పాన్ పెంచుకున్న ప్రభాస్ తన నెక్స్ట్ సినిమాలకు ఆ హవా కొనసాగిస్తున్నాడు. సాహో నేషనల్ వైడ్ రిలీజ్ అవగా ఆశించిన స్థాయిలో అది ఆడలేదు.

ఇక రాబోతున్న రాధే శ్యాం.. సలార్.. ఆదిపురుష్ ఇవి కూడా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఇదిలాఉంటే ప్రభాస్ సినిమాకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు అన్న దాని గురించి మాట్లాడితే.. ప్రభాస్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు 100 కోట్లు డిమాండ్ చేస్తున్నారట. సినిమా బడ్జెట్ 300, 400 కోట్లు ఉంటున్నప్పుడు ప్రభాస్ అంత డిమాండ్ చేయడంలో తప్పు లేదు. అయితే అందులో 40 టూ 50 పర్సెంట్ షూటింగ్ టైం లో ఇచ్చి సినిమా బిజినెస్ జరిగాక కొంత ఇస్తారని కమిట్ అవుతున్నారట.

అంతేకాదు కొన్ని సినిమాలకు రెమ్యునరేషన్ తో పాటుగా బిజినెస్ లో షేర్ కూడా అడుగుతున్నాడని టాక్. డార్లింగ్ కనబడడు కాని రెమ్యునరేషన్ విషయంలో పర్ఫెక్ట్ ప్లానింగ్ లోనే ఉన్నాడని అంటున్నారు. రాధే శ్యాం లవ్ స్టోరీగా వస్తుండగా.. సలార్ కోల్ మైన్ నేపథ్యంతో వస్తుంది. ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ లార్డ్ రామాగా కనిపిస్తారని తెలుస్తుంది. మొత్తానికి ప్రభాస్ తన వరుస సినిమాలతో ఫ్యాన్స్ ను ఖుషి చేస్తున్నాడు. 100 కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే సౌత్ మొదటి స్టార్ గా ప్రభాస్ నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నాడని చెప్పొచ్చు.                        

మరింత సమాచారం తెలుసుకోండి: