సినీ ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు ఎంత కామన్ విడాకులు అంతే కామన్. చాలా మంది ప్రేమించి పెళ్లి చేసుకుని ఒక్కటైన సినీ జంట ఆ తరువాతి కాలంలో తమకు తగదు అని భావించి విడిపోయిన దాఖలాలు చాలా ఉన్నాయి. అలాంటి వారిలో మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది హీరోయిన్ అమలాపాల్ గురించి. ఆమె గతంలో తనతో సినిమా చేసిన దర్శకుడు విజయ్ తో ప్రేమలో పడి అనంతరం పెళ్లి చేసుకుంది. అయితే ఏమైందో ఏమో తెలియదు గానీ పెళ్లి జరిగిన కొన్ని నెలలకే వీరి మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు. ఆ తర్వాత విజయ్ మరో యువతిని పెళ్లి చేసుకుని కొత్త జీవితం కూడా ప్రారంభించారు. 

అమలాపాల్ కూడా ఒక గాయకుడిని పెళ్లి చేసుకుంటుందని ప్రచారం జరిగినా అది నిజం కాదని తేల్చారు. ఇది చాలా రోజుల తర్వాత అమలా పాల్ తన విడాకులకు సంబంధించిన కొన్ని కామెంట్స్ చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చాలా రోజుల తర్వాత అమలాపాల్ డైరెక్ట్ తెలుగు సిరీస్ చేసింది. ప్రఖ్యాత డిజిటల్ ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ సంస్థ తెలుగు వారికి దగ్గరయ్యేందుకు గాను సిరీస్ నిర్మిస్తున్నారు. అలా నాలుగు కథలను కలిపి పిట్ట కథలు పేరుతో మొన్నీమధ్యనే రిలీజ్ చేశారు. 

నాలుగు కథల్లో నందిని రెడ్డి డైరెక్ట్ చేసిన ఒక కథలో అమలాపాల్ మీరా అనే పాత్రలో నటించింది. అనుమానపు భర్త నుంచి అనేక అవమానాలు ఎదుర్కొనే ఒక మహిళ పాత్రలో ఆమె నటించింది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ తన పర్సనల్ లైఫ్ లో కూడా తన డైవర్స్ అయినప్పుడు తనను ఎవరూ పట్టించుకోలేదని చెప్పుకొచ్చింది. తప్పంతా తనదే అయినట్లుగా తనను ఎవరు సపోర్ట్ చేయలేదు అని కనీసం ఎలా ఉందని కూడా ఎవరూ వాకబు చేయలేదు అని చెప్పుకొచ్చింది. మొత్తానికి ఈ విడాకులు తీసుకున్న చాలా గ్యాప్ తర్వాత ఆమెకు విడాకులు గురించి స్పందించడం ఇప్పుడు తెలుగు మీడియా వర్గాల లోనే కాక తమిళ మీడియా వర్గాలలో కూడా చర్చనీయాంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: