ఎట్టకేలకు ఫిబ్రవరి నెల పూర్తయింది. సినిమాల విషయానికి వస్తే టాలీవుడ్ కి జనవరి నెల ఒక మంచి నెల గా నిలిచిపోయింది. ఎందుకంటే కరోనా భయం లాంటివి పెట్టుకోకుండా మంచి సినిమాలు వస్తే కచ్చితంగా థియేటర్లకు వెళ్లి మరీ చూస్తామని ఆడియన్స్ నిరూపించారు. ఫిబ్రవరిలో కూడా అదే భరోసా ఇచ్చారు ఆడియన్స్ వాస్తవానికి ఫిబ్రవరి నెల సినిమాలకు సంబంధించి సీజన్ అని చెబుతారు. అలాంటిది ఈ నెలలో కూడా ఒక బ్లాక్ బస్టర్ హిట్ అందించగా రెండు హిట్స్ అందించారు ప్రేక్షకులు. 

ముందుగా రిలీజ్ డేట్స్ ప్రకారం చూస్తే చైల్డ్ ఆర్టిస్ట్ తేజ సజ్జ హీరోగా మారి చేసిన జాంబీ రెడ్డి అనే సినిమా మంచి లాభాలు తెచ్చుకుని హిట్ సినిమాగా నిలిచింది. అలాగే తన కామెడీ జానర్ పక్కనపెట్టి మొట్టమొదటిసారిగా అల్లరి నరేష్ పూర్తి స్థాయి సీరియస్ పాత్రలో నటించిన సినిమా కూడా ఆయనకు ఎనిమిదేళ్ల తర్వాత హిట్ తెచ్చిపెట్టింది. అయితే మరోపక్క ఫిబ్రవరి 12వ తారీకు రిలీజ్ అయిన ఉప్పెన సినిమా అనేక రికార్డులు బద్దలు కొడుతూ ముందుకు వెడుతోంది. 

ఇప్పటికి 50 కోట్ల క్లబ్లో చేరిన ఈ సినిమా మరిన్ని కలెక్షన్స్ దిశగా దూసుకుపోతోంది. ఇక ఈ నెలలోనే నితిన్ చెక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా అది పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అలాగే సుమంత్ కపట దారి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా అది కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక విశాల్ కూడా చక్ర అనే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చినా అది కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది అని చెప్పాలి. మరి మార్చి నెలలో కూడా భారీగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మరి ఈ సినిమాలో ఏవే సినిమాలు హిట్ అందుకుంటాయి అనేది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: