సూపర్ స్టార్ మహేష్ పరశురాం కాంబినేషన్ లో వస్తున్న సర్కారు వారి పాట సినిమా 2022 సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ కలిసి నిర్మిస్తున్నారు. సినిమాలో మహేష్ లుక్ స్పెషల్ గా ఉండబోతుందని తెలుస్తుంది. దుబాయ్ లో షెడ్యూల్ పూర్తి చేసుకుని వచ్చిన ఈ సినిమా నుండి లేటెస్ట్ అప్డేట్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ ను ఖుషి చేస్తుంది.

ఈ సినిమాలో కొన్ని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఉంటాయట. సినిమాకు హైలెట్ గా ఆ సీన్స్ రెడీ చేస్తున్నారట. పరశురాం చెప్పినప్పుడే మహేష్ సూపర్ ఎక్సయిట్ అయ్యాడని తెలుస్తుంది. అయితే ఈ సన్నివేశాల్లో మహేష్ లుక్ మాత్రం అదిరిపోతుందట. 2005లో వచ్చిన పోకిరి లుక్ తో మహేష్ మళ్లీ దర్శనమిస్తాడని అంటున్నారు. ఏంటి 16 ఏళ్ల క్రితం వచ్చిన పోకిరి లుక్ తో మహేష్ సర్కారు వారి పాటలో కనిపిస్తాడా.. అయితే ఇంకే సినిమా రికార్డులు సృష్టించడం పక్కా అనేస్తున్నారు ఫ్యాన్స్.

గీతా గోవిందం తర్వాత చేస్తే స్టార్ హీరోతోనే సినిమా చేయాలని అనుకున్న పరశురాం తను అనుకున్న విధంగా సూపర్ స్టార్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. అయితే ఈ సినిమాను తను ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు అన్నది టీజర్ వస్తేనే తెలుస్తుంది. మహేష్ మాత్రం సినిమా దుబాయ్ షెడ్యూల్ చాలా సాటిస్ఫైడ్ గా ఉన్నాడట. తప్పకుండా మహేష్ తన ఫ్యాన్స్ ను మరోసారి కాలర్ ఎగురవేసేలా చేస్తాడని అంటున్నారు. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు హ్యాట్రిక్ హిట్లతో దూసుకెళ్తున్న మహేష్ సర్కారు వారి పాటతో డబుల్ హ్యాట్రిక్ కు షురూ చేస్తాడా అన్నది వేచిచూడాలి.               

మరింత సమాచారం తెలుసుకోండి: