చాలా గ్యాప్ తర్వాత అక్కినేని నాగార్జున మళ్లీ సరికొత్త సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్దమయ్యాడు. అది కూడా రియల్ స్టోరీతోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు నాగార్జున. ఇందులో నాగ్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. అందులోనూ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ పాత్రలోనే నాగ్ నటించనున్నాడు. బాంబ్ బ్లాస్ట్ నేపథ్యంలోనే ఈ  ‘వైల్డ్ డాగ్’ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై రూపొందిస్తుున్నారు. కాగా అతి త్వరలోనే ఈ థ్రిల్లర్ మూవీ గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ చిత్రయూనిట్ దానికి సంబంధించిన ఏర్పాట్లని కంప్లీట్ చేసే పనిలో పడింది.
లాంగ్ గ్యాప్ తీసుకున్న నాగార్జున మళ్లీ వైల్డ్ డాగ్ తో మేకప్ వేసుకున్నారు. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుందని ఈ చిత్ర యూనిట్ తెలుపుతోంది. ఇకపోతే ఈ మూవీకి అహిషార్ సోలమన్ డైరెక్షన్ చేస్తున్నారు. ఈ సినిమాలో నాగ్ ఒక పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా కనిపించి ప్రేక్షకులను మెప్పించనున్నారు. ఇకపోతే బాలీవుడ్ నటి సయామీ ఖేర్, అలీ రజా, తదితరులు కూడా పోలీసులుగానే కనిపించనున్నారు. ఈ థ్రిల్లర్ మూవీకి నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డిలు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
కాగా ఈ సినిమా ఏప్రిల్ 2 ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా సోమవారం నాడు హైదరాబాద్ లో ఈ చిత్ర యూనిట్ విలేకర్ల సమావేశం నిర్వహించింది. ఈ సందర్బంగా హీరో నాగార్జున మాట్లాడారు. ‘కొన్నేండ్ల కిందట హైదరాబాద్ లో భయంకరమైన బాంబు పేలుళ్లు సంభవించిన సంగతి తెలిసిందే. వాటిని ఆధారం చేసుకునే ఈ చిత్రం తెరకెక్కింది. కాగా ఈ సినిమాను దర్శకుడు ఒక అందమైన థ్రిల్లర్ మూవీగా తెరకెక్కించారని’ నాగార్జున వ్యాఖ్యానించారు. అలాగే ఈ మూవీలో నాగార్జున ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో కనిపించబోతున్నాని చెప్పారు. ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుందని దర్శకుడు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: