తెలుగు చిత్ర పరిశ్రమలో కొన్ని సూపర్ హిట్ జోడీలు ఉన్నాయి. వారి కాంబినేషన్ లో ఏ మూవీ వచ్చిన ప్రేక్షకులకు పండగే అని చెప్పాలి. వెంకటేష్ మీనా వీళ్ళు ఇద్దరి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. 1990 ల ప్రారంభంలో వీళ్ళు ఇద్దరికీ మంచి డిమాండ్ ఉండేది. చంటి సినిమాతో ఈ పెయిర్ కి తమిళనాడులో కూడా డిమాండ్ వచ్చింది. సుందరాకాండ, అబ్బాయి గారు వంటి సినిమాలతో అలరించారు. 22 ఏళ్ళ తర్వాత దృశ్యంలో నటించారు.

ఇక నాగార్జున, రమ్యకృష్ణ అభిమానులను స్క్రీన్ కు అలా కట్టిపడేసిన జంట ఇది. వీళ్ళ మధ్య కెమిస్ట్రీ ఎప్పుడూ బాగానే ఉంటుంది. హలో బ్రదర్, ఘరానా బుల్లోడు, అన్నమయ్య వంటి అనేక సినిమాల్లో కలిసి నటించారు. ఆ తర్వాత భారీ గ్యాప్ తీసుకుని సోగ్గాడే చిన్ని నాయనా అనే సినిమాలో నటించారు.

టాలీవుడ్ లో ఏ హీరో పక్కన చేసినా సరే శ్రియకు ఉండే గుర్తింపు అంతా ఇంతా కాదు. తన కెరీర్‌లో వరుస అపజయాల నుండి నాగార్జునకు కాస్త ఉపశమనం ఇచ్చిన చిత్రం సంతోషం. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రియ నటించింది. ఇక వీళ్ళ పెయిర్ మనంలో కూడా అలరించింది. బాలకృష్ణ, శ్రియ మొట్టమొదటిసారిగా 2002 లో చెన్నకేసవరెడ్డి అనే సినిమాలో కనిపించారు. ఈ చిత్రానికి వి.వి.వినాయక్ దర్శకత్వం వహించారు.

రాజేంద్ర ప్రసాద్ ఆమనీ వీళ్ళ పెయిర్ కి ఫాన్స్ బ్రహ్మరథం పట్టారు. 1993లో బాపు దర్శకత్వం వచ్చిన ఒక సినిమాలో ఈ ఇద్దరు నటించి ఫాన్స్ ని కట్టిపడేశారు. ఆ తర్వాత పదేళ్లకు వచ్చిన ఆ నలుగురు సినిమాతో ఫాన్స్ కి మరింత దగ్గరయ్యారు. మొట్టమొదటి సారిగా మోహన్ బాబు, మీనా రమ్య కృష్ణ నటించిన చిత్రం అల్లరి మొగుడు. 1992 లో ఈ సినిమా రాగా.. ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయింది. 23 సంవత్సరాల విరామం తరువాత మామ మంచు అల్లుడు కంచు సినిమాలో వీళ్ళు కనిపించారు. ఇలా చెప్పుకుంటూపోతే నరేష్, సితారా, జగపతి బాబు ఆమని, ఈ తరంలో మహేష్ బాబు, సమంతా, ఎన్టీఆర్ సమంతా ఇలా టాలీవుడ్ ఫాన్స్ ని కట్టిపడేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: