యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కాగానే ఈ యంగ్  టైగర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి సినిమా తీయబోతున్నాడన్న సంగతి తెలిసిందే. ఈ సమయం కూడా దగ్గరకు వచ్చేసినట్టే తెలుస్తోంది. అయితే ఈ సినిమాను గతేడాది సమ్మర్ లో షూటింగ్ షురూ చేసి.. ఈ ఏడాది సంక్రాంతి బరిలో దించాలని ప్లాన్ వేశాడు దర్శకుడు. కానీ కరోనా మహమ్మారి కారణంగా మాటల మాంత్రికుడు వేసుకున్న ప్లాన్స్ అన్ని ఒక్క సారిగా తలకిందులయ్యాయి. ఎప్పుడో తెరకెక్కించాలనుకున్న ఈ సినిమా నేటికి కూడా పట్టాలెక్కలేకపోయింది. ప్రస్తుతం యంగ్ టైగర్ కూడా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ఫుల్ బిజీగా ఉన్నాడు.
సినిమా కంప్లీట్ అయిన వెంటనే.. ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో సినిమా చేయనున్నాడు. తాజాగా వస్తున్న సమాచారం మేరకు ఏప్రిల్ నుంచి ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా పట్టాలెక్కనున్నట్టు సమాచారం. అందుకే ఈ సమయంలోనే సినిమాలోకి తీసుకునే నటీనటుల సెలక్షన్స్.. సెట్టింగ్ లొకేషన్ విషయాలను చూసుకుంటున్నారట మాటల మాంత్రికుడు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు.. ఈ సినిమాలోకి ఓ కీలకమైన పాత్రలోకి యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టిని తీసుకుంటున్నారన్న సమాచారం వస్తోంది. నవీన్ పోలిశెట్టిని హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు స్నేహితుడిగా పరిచయం చేయాలనే విధంగా ఈ చిత్ర యూనిట్ ఆలోచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

అందులోనూ ఎన్టీఆర్ కు పోటాపోటీగా నటించాలంటే అది కేవలం నవీన్ పోలిశెట్టి వల్లే అవుతుందని ఈ చిత్ర యూనిట్ భావిస్తోందట. అందుకే ఈ యంగ్ హీరో నవీన్ ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. నవీన్ పోలిశెట్టి ఇప్పటికే ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్నేయ’ సినిమాలో నటించి ప్రేక్షకుల నుంచి మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. తన మాటల గారడీతో ప్రతిభ గల నటుడిగా మాంచి మార్కులు సంపాదించుకున్నాడు నవీన్. ఇక ప్రస్తుతం ఈ హీరో ‘జాతి రత్నాలు’ సినిమాతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి వస్తున్నారు. ఇలాంటి సమయంలో ఈ యంగ్ హీరో స్టార్ హీరో సినిమాలో నటించే అవకావం దక్కించుకోవడం గొప్ప విషయం. ఈ సినిమాలో వచ్చిన సువర్ణావకాశాన్ని పోలిశెట్టి కూడా వదులుకోదలచుకోలేదట. ఈ సినిమా షూటింగ్ షురూ అయిన వెంటనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్టు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: