సీనియర్ టాలీవుడ్ హీరో చిరంజీవి ప్రస్తుతం వరుస సక్సెస్ ల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న మెసేజ్ తో కూడిన యాక్షన్, ఎమోషనల్ కమర్షియల్ సినిమా ఆచార్య. ఏడాదిన్నర క్రితం యువ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ ఆ మూవీతో బాగానే విజయాన్నిసక్సెస్ ని అందుకున్నారు. దానితో ప్రస్తుతం తెరకెక్కుతున్న ఆచార్య మూవీ పై అందరిలో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. మెగాస్టార్ చిరంజీవి ఇందులో ఒక మాజీ నక్సలైట్ పాత్ర చేస్తుండగా తొలిసారిగా ఆయనతో కలిసి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు.

కాగా చరణ్ ఈ మూవీలో సిద్ద అనే పాత్ర చేస్తున్నారని ఇటీవల యూనిట్ ప్రకటించింది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ ప్రతిష్టాత్మక సినిమా ప్రస్తుతం వేగవంతంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్ కి ప్రేక్షకాభిమానులు నుండి బాగా రెస్పాన్స్ వచ్చింది. మెగాస్టార్ కి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తున్న ఈ మూవీలో చరణ్ కి జోడీగా పూజా హెగ్డే నటిస్తున్నట్లు తెలుస్తోంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలపై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి కలిసి ఎంతో భారీ ఖర్చుతో నిర్మిస్తున్న ఈ ఆచార్య సినిమా, దేవాలయాల భూములు, కుంభకోణాల నేపథ్యంలో రూపొందుతుండగా అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునే విధంగా దర్శకుడు కొరటాల శివ దీనిని తీస్తున్నట్లు సమాచారం. 

ఇక అసలు మ్యాటర్ ఏమిటంటే, తొలిసారిగా మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మూవీ కావడంతో మెగా ఫ్యాన్స్ లో దీనిపై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇక ఇందులో చరణ్, చిరంజీవి కలిసి ఉన్న సన్నివేశాలు ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకుంటాయని, తప్పకుండా రిలీజ్ తరువాత ఈ మూవీ సూపర్ హిట్ కొట్టి తీరుతుందని, ఆచార్య యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ మూవీ సమ్మర్ కానుకగా మే 13న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. మరి ఈ మూవీ కనుక పెద్ద హిట్ కొడితే బాక్సాఫీస్ రచ్చే అని చెప్పకతప్పదు....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: