మెగాస్టార్ చిరంజీవి నుంచి వరుణ్ తేజ్ వరకు మెగా ఫ్యామిలీ నుంచి ప్రతి ఒక్కరూ వైష్ణవ్ తేజ్ సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సినిమా వీక్షించిన తర్వాత సినిమా చాలా బాగుందని కంగ్రాచ్యులేషన్స్ కూడా చెప్పారు. కానీ అల్లు అర్జున్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా ఉప్పెన సినిమాని ప్రమోట్ చేయలేదు. కనీసం సినిమా చూసైనా తన బంధువు సినిమా పై మంచి వ్యాఖ్యలు చేసినట్టయితే బాగుండేది. కానీ మెగా హీరో తొలిచిత్రం పై అల్లు ఫ్యామిలీ నుంచి ఎటువంటి స్పందన రాలేదు.


ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ చావు కబురు చల్లగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పయనమయ్యారు. ఈ సినిమాలో కార్తికేయ లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాని మార్చి 19వ తేదీన విడుదల కానుండగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని 9వ తేదీన ప్లాన్ చేశారు. అయితే బన్నీ తన కజిన్ సినిమా కార్యక్రమాలకి హాజరు కాలేదు కానీ ఇప్పుడెలా కార్తికేయ సినిమా ప్రమోషన్ ఈవెంట్స్ కి విచ్చేస్తున్నారు? అని కొందరు మెగా ఫ్యాన్స్ సూటిగా ప్రశ్నిస్తున్నారు.


అయితే ఈ సినిమాని అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. అందుకే అల్లు అర్జున్సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడానికి సిద్ధమయ్యారు. అయితే కజిన్ కోసం విరామ సమయం ఉండదు కానీ తండ్రి కోసమైతే సమయం ఉంటుందా? అనే ప్రశ్న తలెత్తుతోంది. దీంతో ఆయన స్వల్పమైన కాంట్రవర్సీలో చిక్కుకుపోయారని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.


ఇకపోతే జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై చావు కబురు చల్లగా మూవీ ని బన్నీవాసు నిర్మించారు. ఈ రొమాంటిక్ కామెడీకి నూతన దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి జేక్స్ బెజాయ్ సంగీతం అందించగా కరమ్ చావ్లా సినిమాటోగ్రఫీ అందించారు. సత్య జి ఎడిటర్ గా పని చేశారు. శివకుమార్ భూజుల అడిషనల్ డైలాగ్స్ అందించారు. ఆమ‌ని, ముర‌ళీ శ‌ర్మ, ర‌జిత‌, భ‌ద్రం, మ‌హేష్‌, ప్రభు ప్రధాన పాత్రలలో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: