గతేడాది కరోనా విజృంభణ వల్ల లాక్ డౌన్ అమలు కావడంతో థియేటర్లు మూతపడ్డాయి. ఆ సమయంలో చాలా సినిమాలు ఓటీటీల్లో విడుదలయ్యాయి. కానీ ఏ1 ఎక్స్ప్రెస్ను మాత్రం థియేటర్లలో విడుదాల చేయాలని తాను పట్టుబట్టినట్లు లావణ్య చెప్పారు. ‘మా సినిమాకు ఓటీటీ ఆఫర్లు బాగానే వచ్చాయి. కానీ నేను మాత్రం సినిమాను థియేటర్లలోనే విడుదల చేయాలని మూవీ మేకర్స్కు చెప్పాను. సినిమా విడుదల గురించి తెలుసుకోవడానికి తరచుగా సందీప్ కిషన్కు ఫోన్ చేసేదాన్ని. దీంతో నా కాల్ లిఫ్ట్ చేయడానికి కూడా సందీప్ భయపడ్డాడం’టూ లావణ్య చెప్పుకొచ్చింది.
ఇదిలా ఉంటే లావణ్య ప్రస్తుతం రెండు సినిమాల్లో నటించింది. వాటిలో ఏ1 ఎక్స్ప్రెస్ ఒకటి కాగా.. కార్తికేయకు జోడీగా నటించిన చావు కబురు చల్లగా సినిమా రెండోది. వీటిలో ఏ1 ఎక్స్ప్రెస్ మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుండగా.. చావు కబురు చల్లగా మూవీ మార్చి 19వ తేదీన విడుదల కానుంది. ఇప్పటికే స్టార్ హీరోల మూవీస్లో ఛాన్స్లు రాకపోవడం వల్ల లావణ్య త్రిపాఠి స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకోలేకపోయింది.
లావణ్య కెరీర్లో భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్నినాయన లాంటి బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి. అయితే ఆ హిట్లు ఆమె కెరీర్కు ఉపయోగపడలేదు. కానీ.. తాజాగా తెరకెక్కిన రెండు సినిమాలపై ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడటంతో లావణ్య త్రిపాఠికి 2021 సంవత్సరం కలిసొస్తుందని ఆమె ఫ్యాన్స్ భావిస్తున్నారు.