ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..మెగా మేనల్లుడు ప్రముఖ హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన సినిమా 'ఉప్పెన'.ఇటీవల కాలంలో ఈ సినిమాకి చేసిన ప్రమోషన్స్ దేనికి చెయ్యలేదు. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతుంది.ఇక ఇప్పటికి ఈ చిత్రం విడుదలయ్యి 18 రోజులు కావస్తున్నా కలెక్షన్ల జోరు ఏమాత్రం తగ్గడం లేదనే చెప్పాలి.రికార్డు స్థాయిలో కలెక్షన్స్ ని రాబడుతుంది.ఫిబ్రవరి వంటి అన్ సీజన్లో.. ఓ పక్క కొత్త కొత్త సినిమాలు విడుదలవుతున్నా.. ఇంకా ఈ చిత్రం స్ట్రాంగ్ రన్ ను కొనసాగిస్తూ ఉండడం అందరినీ ఆశ్చర్యపరిచే విషయం. కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేశాడు. 'మైత్రి మూవీ మేకర్స్' మరియు 'సుకుమార్ రైటింగ్స్' బ్యానర్ల పై నవీన్ యర్నేని, వై.రవి శంకర్, సుకుమార్ లు కలిసి నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 12న విడుదలయ్యింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతంలో రూపొందిన పాటలు, హీరోయిన్ కృతి శెట్టి లుక్స్ వంటివి మొదటి నుండీ ఈ చిత్రం పై భారీ అంచనాలు పెరిగేలా చేసాయి.


ఇక విడుదల అయిన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ని కంప్లిట్ చేసుకున్న ఈ సినిమా.. ఇక 18 రోజుల వసూళ్ల విషయానికి వస్తే...'ఉప్పెన' చిత్రానికి 20.5 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కు 21కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉండగా.. ఆ టార్గెట్ ను 3 రోజుల్లోనే ఫినిష్ చేసింది ఈ చిత్రం. ఇక 18 రోజులు పూర్తయ్యేసరికి ఏకంగా 49.44 కోట్ల షేర్ ను రాబట్టి.. ఇప్పటికీ స్ట్రాంగ్ గా రన్ అవుతోంది.దీంతో 28.44 కోట్ల లాభాలను బయ్యర్లకు అందించింది ఈ చిత్రం. 3వ సోమవారం కూడా ఈ చిత్రం 0.42కోట్ల షేర్ ను రాబట్టింది.మరో 2 రోజుల్లో ఈ చిత్రం 50కోట్ల షేర్ ను కూడా అధిగమించే అవకాశాలు చాలా ఉన్నాయి.ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకొండి...

మరింత సమాచారం తెలుసుకోండి: