శ్రీదేవి వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్, ఇప్పటివరకు స్టార్ హీరోయిన్ కేటగిరీలో చేరలేదు. పెర్ఫామర్గానూ ప్రూవ్ చేసుకోలేకపోతోంది. విమెన్ పైలట్ గుంజన్ సక్సేనా లైఫ్ స్టోరీతో చేసిన 'గుంజన్ సక్సేనా-ది కార్గిల్ గర్ల్'కి అయితే చాలా విమర్శలొచ్చాయి. జాన్వీకి అసలు యాక్టింగ్ వచ్చా అనే కామెంట్స్ కూడా వినిపించాయి.
జాన్వీ కపూర్ని స్టార్ హీరోలు పెద్దగా కన్సిడర్ చేయడం లేదు. బాలీవుడ్ టాప్ హీరోలైతే ఈమెని స్టార్ మెటీరియల్గా చూడలేకపోతున్నారు. దీంతో చిన్న సినిమాలతోనే నెట్టుకొస్తోంది జాన్వీ. అయితే ఈ లోబడ్జెట్ మూవీస్లో కూడా జాన్వీ పెద్దగా మేజిక్ చేయలేకపోతోంది. ఆడియన్స్ని ఇంప్రెస్ చేయడంలోనూ ఫెయిల్ అవుతోంది.
జాన్వీ కపూర్ ఎంట్రీ ఇచ్చి రెండేళ్లు దాటుతున్నా ఇంకా సొంత గుర్తింపు తెచ్చుకోలేదు. మేకర్స్కి ఒక నమ్మకం ఇవ్వలేకపోతోంది. దీంతో ఈమె కెరీర్ గేట్స్ క్లోజ్ అవుతున్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ డేంజర్ జోన్ నుంచి జాన్వీ కపూర్ బయటపడుతుందా, లేక నాలుగైదు సినిమాలతోనే కెరీర్ ముగుస్తుందా అనేది చూడాలి. మొత్తానికి జాన్వీ కపూర్ కెరియర్ క్లైమాక్స్ కు చేరిందనే గాసిప్స్ గుప్పుమంటున్నాయి. ఇప్పటి వరకు స్పెషల్ మార్క్ చూపించని ఈ బ్యూటీపై దర్శక, నిర్మాతలు ఆశలు సన్నగిల్లాయి. ఏం చేసినా.. శ్రీదేవి అభిమానులను ఆకట్టుకోలేకపోతోంది జాన్వీ. ఏమని గుంజన్ సక్సేనా చేసిందో ఆమె విమర్శల ఊబిలో పడిపోయింది. తల్లిలా కూతురు యాక్టింక్ చేయలేదనే వాదనను మూటగట్టుకుంది ఈ బ్యూటీ. బాలీవుడ్ స్టార్స్ అయితే ఈమెను అసలు హీరోయిన్ లా ట్రీట్ చేయడం లేదు.