ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ "అజ్ఞాతవాసి" సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకోని రాజకీయాల్లో బిజీ అయ్యి మళ్ళీ బ్రేక్ తీసుకోని "వకీల్ సాబ్" చేస్తున్న సంగతి తెలిసిందే.. ఇక గతేడాది ఆ సినిమాలోని 'మగువ మగువ' అనే పాట విడుదలైంది. పాటలో పవన్ కళ్యాణ్ ఎక్కడా లేకపోయినప్పటికీ.. సినిమా నుంచి ఎట్టకేలకు ఒక పాట రూపంలో అప్ డేట్ వచ్చినందుకు పవన్ ఫ్యాన్స్ తెగ ఖుషి అయ్యారు. తమన్ కూడా రెగ్యులర్ గా కాకుండా మంచి ట్యూన్ తో అందించిన మగువ మగువ పాట ఒక రేంజిలో హిట్ అయ్యింది. ఆ తర్వాత కరోనా వల్ల ప్రమోషన్స్ కొంచెం ఆగిపోయాయి. మధ్యలో టీజర్ వచ్చి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను ఖుషీ చేసింది.


అయితే.. ఏప్రిల్ 9న విడుదలవ్వాల్సిన సినిమాకి మార్చి వచ్చినా ప్రమోషన్స్ లేకపోవడంతో పవన్ ఫ్యాన్స్ నిరుత్సాహ పడ్డారు. వాళ్ళ టెన్షన్ ను అర్ధం చేసుకున్నారో ఏమో దిల్ రాజు & టీం కొత్త పాటను ఎనౌన్స్ చేఎబోతున్నారట.. ఈ పాటను శ్రోతలను ఉర్రుతలూగించేలా తమన్ కంపోజ్ చేశాడట...రేపు (మార్చి 3) 'వకీల్ సాబ్' చిత్రం నుంచి టైటిల్ సాంగ్ 'సత్యమేవ జయతే' సాయంత్రం 5.00 గంటలకు విడుదలవుతుంది. ఆల్రెడీ ఈ ట్యూన్ బీట్ ను టీజర్ లోనే టేస్ట్ చూపించాడు తమన్.


 మరి రేపు విడుదలవ్వబోయే ఫుల్ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి.ఇక యస్ యస్ తమన్ తన మ్యూజిక్ తో ప్రేక్షకులని ఆకట్టుకుంటున్న తమన్ ఈ పాటతో ఇంకెంత బాగా మెప్పిస్తాడో చూడాలి.. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ గురించి తెలుసుకోండి....


మరింత సమాచారం తెలుసుకోండి: