ఈటీవీ
జబర్దస్త్ లో యాంకర్ గా
రష్మీ అందరికి తెలిసిన అమ్మాయే. తన అందంతో నవ్వుతో
రష్మీ ఈ షో కి కొత్త కళ తీసుకొని వస్తుంది.కానీ
రష్మీ మాత్రం ఈటీవీలో తప్పా మరెక్కడా కనిపించదు.యాంకర్
రష్మీ మొత్తంగా ఈటీవీలోనే కనిపిస్తుంటుంది. ఎక్స్ ట్రా
జబర్దస్త్, ఢీ షోలంటూ అక్కడే తిరుగుతూ ఉంటుంది. ఎవరు ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చినా కూడా పక్క చానెళ్లకు వెళ్లదు. పక్క చూపులు చూడదు. స్పెషల్ ఈవెంట్లు చేసినా కూడా అదే చానెల్లో చేస్తుంటుంది.యాంకర్
సుమ,
అనసూయ,
శ్రీముఖి వంటి వారు మాత్రం ఎక్కడ అవకాశాలు వస్తే అక్కడికి వెళ్తుంటారు. అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా అన్ని చానెల్స్ను కవర్ చేస్తుంటారు.
స్టార్ మా,
జెమిని, జీ తెలుగు, ఈటీవీ ఇలా అన్నింట్లోనూ కనిపిస్తుంటారు. కానీ తాజాగా
రష్మీ కూడా రూట్ మార్చేసినట్టుంది.స్టార్ మాలో ఈ మధ్య కొత్త షోలను ప్రారంభిస్తున్నారు. ఫిబ్రవరిలో మొదటి రెండు వారాలు
బిగ్ బాస్ ఉత్సవం అంటూ సందడి చేశారు. ఈ ఆదివారం నాడు 100 పర్సెంట్
లవ్ అంటూ ఆరుగురు రియల్ జంటలు.. ఆరుగురు రీల్ జంటలు అంటూ రచ్చచేసేందుకు రాబోతోన్నారు.అయితే
రష్మీ హీరోయిన్ గా సినిమాలు కూడా చేసి అలరించింది. ఆమె నటించిన
గుంటూరు టాకీస్ సినిమా ఒక మోస్తరు విజయం సాధించింది. ఈ
సినిమా తర్వాత ఆమె చేసిన సినిమాలు ఏవి అంతగా ఆడలేదు. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల ప్రకారం రష్మీక సినిమాలకి టాటా చెప్పబోతుంది అని టాక్. ఆమె నటించిన బొమ్మ
బ్లాక్ బస్టర్ సినిమా విడుదలకి సిద్ధంగా ఉంది. అయితే ఈ
సినిమా తర్వాత
రష్మీ ఇక సినిమాలు చేయదు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజం ఎంత ఉందో ఇంకా స్పష్టం కాలేదు. ఇక నందు హీరోగా నటిస్తున్న ఈ బొమ్మ
బ్లాక్ బస్టర్ సినిమా పాటలు ఇప్పటికే విడుదలై సూపర్ హిట్ అయ్యాయి.