జబర్దస్త్ షో చూసే వాళ్లందరికీ యాంకర్ అనసూయ బాగా తెలుసు. ఆమె రంగస్థలం సినిమాలో తన నటనతో యాంకర్ గానే కాకుండా నటిగా కూడా మంచి పేరు తెచ్చుకున్న అనసూయ ప్రస్తుతం కొత్త సినిమాతో మన ముందుకు రాబోతుంది. థాంక్ యు బ్రదర్ పేరుతో వస్తున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతుంది.జస్ట్‌ ఆర్డినరీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై మాగుంట శరత్‌ చంద్రారెడ్డి, తారక్‌నాథ్‌ బొమ్మిరెడ్డి నిర్మించారు. అయితే ఇప్పుడు ఆమె చావు కబురు చల్లగా అనే సినిమాలో ఐటమ్ సాంగ్ కూడా చేస్తున్నారు. ఈ సాంగ్ టీజర్ ఈమద్యనే విడుదలయ్యింది. ఈ సినిమా లో ఐటమ్ సాంగ్ చూడటానికి చాలా బాగుంది. అయితే ఇప్పుడు ఈ పాట మీద కామెంట్స్ మొదలయ్యాయి. వాటికి అనసూయ ఘాటుగా స్పందించారు. ఒక అభిమాని మీరు ఐటమ్ సాంగ్స్ చేయను అన్నారు కదా అని అనడంతో ఆమె ట్విట్టర్ లో రిప్లై ఇచ్చింది. అది ఐటమ్ సాంగ్ కాదు , స్పెషల్ సాంగ్ అని ఆమె ఘాటుగా స్పందించింది. తన గురించి తనకి బాగా తెలుసు అని ఆమె అన్నారు.ఇక ఆమె నటిస్తున్న కొత్త చిత్రం థాంక్యూ బ్రదర్ సినిమాలో గర్భవతి ప్రియ క్యారెక్టర్ లో అనసూయ అలాగే అభి గా విరాజ్ ఆనంద్ కనిపించబోతున్నారు.ఒక లిఫ్ట్ లో చిక్కుకుపోయిన ఇద్దరు కథ తో వస్తున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కాబోతుంది.ఈ సినిమాతో రమేష్‌ రాపర్తి దర్శకునిగా పరిచయమవుతున్నారు.ఈ చిత్రానికి కెమెరా సురేష్‌ రగుతు, సంగీతం గుణ బాల సుబ్రమణియన్‌ పని చేస్తున్నారు. మనసానమః షార్ట్ ఫిల్మ్ లో హీరోగా అందరి దృష్టి ని ఆకర్షించిన అశ్విన్ విరాజ్ ఈ సినిమాతో హీరో గా ఎంట్రీ ఇస్తున్నాడు. పాత్రలో ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉండే అనసూయ ఇప్పుడు ఈ చిత్రంలో చేస్తుండటంతో సినిమా మీద మంచి బజ్ ఏర్పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: