టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ గతేడాది భీష్మ మూవీతో సూపర్ హిట్‌ను అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం నితిన్ వెంకీ అట్లూరి  దర్శకత్వంలో రంగ్‌ దే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో నితిన్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే  రిలీజ్ చేసిన ఈ సినిమా టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మార్చి 26న ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్టు మూవీ టీం సోషల్ మీడియా ద్వారా ఎప్పుడో ప్రకటించారు.తొలిప్రేమ , మజ్ను లాంటి సినిమాలతో లవ్ స్టోరీస్ మీద మంచి పట్టు ఉన్న దర్శకుడిలాగా కనిపిస్తున్న వెంకీ అట్లూరి ఈ సినిమాతో ఎలా మ్యాజిక్ చేయబోతున్నాడో అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకి ఇంకో విశేషం ఏంటి అంటే ప్రముఖ  పి సి శ్రీరామ్ గారు సినిమాటోగ్రాఫర్ గా పనిచేయడం ఆయనకి మణిరత్నం ,శంకర్ లాంటి పెద్ద పెద్ద దర్శకులతో తీసిన పని చేసిన అనుభవం ఉంది. ఇక దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి విడుదలైన పాటకి చాలా మంచి స్పందన వచ్చింది.అయితే ఇప్పుడు ఇంకొక పాట విడుదల కాబోతుంది. ఈ పాట ని మహేష్ బాబు తన సోషల్ మీడియా ద్వారా విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి స్పందన రావడంతో సినిమా మీద అంచనాలు పెరుగుతున్నాయి.నితిన్ ఆశలు పెట్టుకున్న చెక్ సినిమా ప్లాప్ అవ్వడంతో ఆయన కొంచెం డీలా పడ్డారు.అయితే ఇప్పుడు మంచి లవ్ స్టొరీతో వస్తున్న నితిన్సినిమా మీద కాన్ఫిడెంట్ గా ఉన్నారు. తెలుగులో విడుదలైన ప్రేమకథలన్నీ చాలా వరకు హిట్ అయ్యాయి. అలాగే ఈసినిమా కూడా మంచి హిట్ అవుతుంది అని మూవీ టీం అనుకుంటున్నారు.ఇక ఈ సినిమా తర్వాత నితిన్ అందదున్ రీమేక్ లో నటించబోతున్నారు.ఈ సినిమా పూజ ఈ మద్యనే జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: