ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గతేడాది త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన "అల వైకుంఠపురంలో" సినిమాతో పెద్ద హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో తన తరువాత సినిమాపైన భారీ అంచనాలు పెరిగాయి. అందుకే క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. ఇక సుకుమార్ తో బన్నీ చేస్తున్న సినిమా పుష్ప. ఈ సినిమా ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేసేస్తోంది. ఈ సినిమా నుంచి ఎలాంటి అప్ డేట్ వచ్చినా వెంటనే వైరల్ చేస్తున్నారు అభిమానులు. అంతేకాదు, ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ ని చేస్తూ అఫీషియల్ లోగోలని వాటిపై పెడుతూ డైరెక్టర్ సుకుమార్ కే షేర్ చేస్తున్నారు.



దీనివల్ల ఒరిజినల్ పోస్టర్ ఏది.. ఫ్యాన్స్ మేడ్ పోస్టర్ ఏదో కూడా అర్ధం కాని పరిస్థితి. ఇది ఇలా ఉంటే ఈ సినిమాని చాలా జాగ్రత్తగా తెరకెక్కించేందుకు చిత్రయూనిట్ కి సవాల్ గా మారిందట. అడవిలో గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.దీన్ని నేషనల్ సబ్జెక్ట్ గా మారుస్తూ ప్రతి సన్నివేశాన్ని ఆసక్తికరంగా తెరకెక్కించబోతున్నారు. అంతేకాదు, అప్పట్లో పోలీస్ ఎన్ కౌంటర్స్ ఎలా ఉండేవి, ఎలా కేసులని బయటకి రాకుండా మాయం చేసేవాళ్లు అనే కోణంలో కూడా సినిమా ఉండబోతోందట. ఎలాంటి కాంట్రవర్సీలు రాకుండా ఈ సినిమాని చేయాలని చూస్తోంది చిత్రయూనిట్. మరోవైపు మేకర్స్ ఈసినిమాని ఏకంగా పదిభాషల్లో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. అల వైకుంఠపురములో సినిమాతో అనేక భాషలలో  బన్నీకి సోషల్ మీడియాలో ఎంత క్రేజ్  వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.



సాంగ్స్ కి వచ్చిన క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.అందుకే, ఇప్పుడు ఈ సినిమాని ప్రతి భాషలో విడుదల చేస్తే మినిమమ్ మార్కెట్ కొట్టొచ్చని ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ సినిమాతో బన్నీ జెండా పాతి ప్రభాస్ లాగా పాగా వేయబోతున్నాడు. అక్కడ తన మార్కెట్ స్టామినాని పరీక్షించుకోబోతున్నాడు. బన్నీ డ్యాన్స్ కి బాలీవుడ్ లో చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. కాబట్టి ఈసినిమా ఏమాత్రం పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా కూడా బాలీవుడ్ బాక్సీఫీస్ ని షేక్ చేయడం ఖాయంలా కనిపిస్తుంది.ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: